తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) రాష్ట్రాల మధ్య తలెత్తిన నీటి వివాదాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఏపీ(AP)తో వివాదాలు కోరుకోవడం లేదని, సమస్యలను శాంతియుతంగా చర్చల ద్వారానే పరిష్కరించాలని భావిస్తున్నామని తెలిపారు. దీనికై తానే స్వయంగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడిని ఆహ్వానిస్తానని వెల్లడించారు. “వచ్చి నాలుగు రోజులైనా కూర్చొని మాట్లాడతా. విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గను,” అంటూ ఆయన తేల్చిచెప్పారు.
గోదావరి నీళ్లే కీలకం
సీఎం రేవంత్ వ్యాఖ్యానంలో గోదావరి నీళ్ల ప్రాధాన్యం స్పష్టంగా కనిపించింది. చంద్రబాబు గెలవాలంటే గోదావరి నీళ్లు అవసరమని, అదే నీళ్లపై ఆధారపడే బీఆర్ఎస్ రాజకీయ ప్రయోజనాల కోసమే వివాదాలు రేగిస్తున్నాయని వ్యాఖ్యానించారు. నీటి విషయంలో తెలంగాణకు అన్యాయం జరగకుండా, తమ హక్కులు కోల్పోకుండా చూసుకోవడం అవసరమన్నదే తమ వైఖరి అని స్పష్టం చేశారు.
వివాదాల పరిష్కారానికి చర్చలే మార్గం
రాష్ట్రాల మధ్య సహకారం, సమన్వయమే సమస్యల పరిష్కారానికి మార్గమని సీఎం రేవంత్ అన్నారు. రాజకీయ లబ్ది కోసం నీటి అంశాన్ని వాడుకోవడం సరికాదని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల ప్రయోజనాల దృష్ట్యా సమగ్ర చర్చలు జరగాలని, అందుకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. ఈ అంశంపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Read Also : Free Helmets : బైక్ కొంటే 2 హెల్మెట్లు ఫ్రీ.. ఎప్పటి నుండి అంటే ?