తెలంగాణ సెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసా గుతున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఆయన ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న రెండు చారిత్రాత్మక బిల్లులు – బీసీ రిజర్వేషన్లు పెంపు, ఎస్సీ వర్గీకరణ బిల్లులు – ఈరోజు, రేపు అసెంబ్లీ వేదికగా చర్చకు రానున్నాయి. ఈ బిల్లులు ఆమోదం పొందితే, రాష్ట్ర రాజకీయాల్లో ఇది ఒక కీలక మలుపుగా నిలిచే అవకాశం ఉంది.
బీసీ రిజర్వేషన్లు – 42% కు పెంపు
బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడం తో పాటుగా సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి ఎస్సీల వర్గీకరణకు చట్టబద్ధత అంశాలను కల్పించేలా రూపకల్పన చేసిన బిల్లులు సభ ముందుకు తెస్తోంది.ఈ రెండు బిల్లులకు ఇప్పటికే తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలపడంతో బిల్లులకు శాసనసభలో ప్రవేశ పెట్టనున్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణలపై శాసనసభ, మండలిలో ఈ రోజు రేపు (సోమ, మంగళ వారం) ప్రత్యేక చర్చ జరగనుంది.
ఎస్సీ వర్గీకరణ – సుప్రీంకోర్టు తీర్పుకు లోబడి చట్టబద్ధత
ఇదే సమయంలో ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో చర్చకు రానుంది.ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ పైన సుప్రీం తీర్పుతో తెలంగాణలో అమలు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. భవిష్యత్తులో న్యాయ వివాదాలు తలెత్తకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ప్రభుత్వం జస్టిస్ షమీమ్ అక్తర్ ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్ను నియమించింది. ఈ కమిషన్ ఇచ్చని నివేదికలో ఎస్సీ ఉప కులాలను మూడు గ్రూపులుగా వర్గీకరించాలని సిఫారసు చేసింది.
అసెంబ్లీలో చర్చ
ఈ వివరాలను ప్రభుత్వం సభలో వెల్లడించింది. కాగా, గ్రూపుల వర్గీకరణపై మరికొన్ని కుల సంఘాల నుంచి అభ్యంతరాలు, సూచనలు రావడంతో వాటిని పరిశీలించాలని కమిషన్ను ప్రభుత్వం కోరింది. వాటిని పరిశీలించి న షమీమ్ అక్తర్ కమిషన్ తాజాగా ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక మేరకు బిల్లు సిద్దమైంది. దీంతో, ఈ రెండు రోజులు అసెంబ్లీలో ఈ బిల్లుల పైన చర్చ కీలకంగా మారనుంది.

తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయాలు రాష్ట్ర సామాజిక నిర్మాణంలో గొప్ప మార్పుకు దారి తీసే అవకాశం ఉంది. బీసీ, ఎస్సీ వర్గాలకు న్యాయం చేయడంలో ఈ చట్టాలు కీలకపాత్ర పోషించనున్నాయి.రాష్ట్ర రాజకీయ భవిష్యత్తుపై ఈ చర్చ ఎంత ప్రభావం చూపుతుందో వేచిచూడాల్సి ఉంది.