Revanth Reddy కంచ భూముల పై రేవంత్ రెడ్డి సమీక్ష

Revanth Reddy : కంచ భూముల పై రేవంత్ రెడ్డి సమీక్ష

హైదరాబాద్‌ గచ్చిబౌలి పరిధిలోని కంచ భూముల వ్యవహారం ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.తాజాగా సీఎం రేవంత్ రెడ్డి దీనిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.భూముల్లో చెట్లు నరికి వేయడంపై,వన్యప్రాణులు ప్రాణభయంతో పారిపోతున్నాయని ఆరోపణల నేపథ్యంలో ఈ సమీక్ష జరిగింది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా రూపొందించిన కొన్ని ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.వన్యప్రాణులు అల్లకల్లోలం అవుతున్నట్టు చూపిస్తూ ప్రజల్లో భయాందోళనలు కలిగించాయి.ఈ వ్యవహారాన్ని సీఎం ఎంతో సీరియస్‌గా తీసుకున్నారు.ఇలాంటి ఫేక్ కంటెంట్ సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.వాస్తవాలు ప్రజల ముందుకు రావాలంటే విచారణ అనివార్యమని సీఎం అభిప్రాయపడ్డారు.అందుకోసమే కోర్టును ఆశ్రయించాలని సూచించారు.

Advertisements
Revanth Reddy కంచ భూముల పై రేవంత్ రెడ్డి సమీక్ష
Revanth Reddy కంచ భూముల పై రేవంత్ రెడ్డి సమీక్ష

ఈ వీడియోలు ఉద్దేశపూర్వకంగా సృష్టించబడ్డాయన్న అనుమానంపై విచారణ జరిపించాలని ఆదేశించారు.గచ్చిబౌలి ప్రాంతంలో గత 25 ఏళ్లలో ఎన్నో నిర్మాణాలు జరిగినప్పటికీ.ఎప్పుడూ వన్యప్రాణులపై ఇలాంటి ఆరోపణలు రాలేదని అధికారులు గుర్తు చేశారు.ఇప్పుడొచ్చిన వీడియోలు అసత్య సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించడానికే సృష్టించబడ్డవని తెలిపారు.ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకూడదన్న దృక్పథంతో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలని స్పష్టం చేశారు.ఫేక్ ఏఐ వీడియోలను గుర్తించే స్పెషలైజ్డ్ టూల్స్ – ఫోరెన్సిక్, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ పరిజ్ఞానం అందుబాటులో ఉండాలన్నారు.ఈ సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, అటవీశాఖ అధికారులు, టీజీఐఐసీ ఎండీ పాల్గొన్నారు.

READ ALSO : Chennai Super Kings : చెన్నైకి మరో షాక్ – ఢిల్లీ చేతిలో పరాజయం

Related Posts
Revanth Redddy: కంచ గచ్చిబౌలి భూవివాదంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Revanth Redddy: కంచ గచ్చిబౌలి భూవివాదంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో విద్యార్థుల ఆందోళనలు, ర్యాలీలు, అరెస్టులతో గత కొన్ని రోజులుగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వివాదాస్పద భూవిషయంలో విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు Read more

Amaravati : తిరుమలను తలపించేలా అమరావతిలో శ్రీవారి ఆలయం
Amaravati తిరుమలను తలపించేలా అమరావతిలో శ్రీవారి ఆలయం

Amaravati : తిరుమలను తలపించేలా అమరావతిలో శ్రీవారి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తిరుమలను తలపించేలా శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. Read more

AndhraPradesh: ఏపీ ప్రజలకు శుభవార్త ఇకపై బియ్యంతో పాటు చిరు ధాన్యాలు పంపిణీ
AndhraPradesh: ఏపీ ప్రజలకు శుభవార్త ఇకపై బియ్యంతో పాటు చిరు ధాన్యాలు పంపిణీ

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సర్కార్ మరో శుభవార్తను ప్రకటించనుంది.రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు ఇకపై బియ్యంతో పాటు చిరుధాన్యాలు కూడా సరఫరా చేయాలని ప్రభుత్వం Read more

మహాశివరాత్రి వేళ.. భక్తులతో కిటకిట లాడుతున్న కాశీ
On the occasion of Mahashivratri.. Kashi is hanging out with devotees

గంగా సంగమం జరిగే ప్రదేశం అస్సీ ఘాట్ కాశీ : మహాశివరాత్రి వేళ వారణాసిలో ఘాట్ లు అన్నీ భక్తులతో కిటకిట లాడుతున్నాయి. కుంభమేళాకు వెళ్ళిన భక్తులు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×