Revanth Reddy letter to Prime Minister Modi

Revanth Reddy : ప్రధాని మోడీకి రేవంత్ రెడ్డి లేఖ

Revanth Reddy : ప్రధాని మోడీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం, సీపీఐ నాయకులతో ప్రధానిని కలిసేందుకు అపాయింట్ మెంట్ కోరుతూ ఆ లేఖ రాశారు. స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగ రంగాల్లో వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లకు సంబంధించి అసెంబ్లీలో రెండు బిల్లులు ప్రవేశ పెట్టారు. ఆ రెండు బిల్లులు అమోదం పొందాయి. ఈ నేపథ్యంలో బిల్లులకు కేంద్రం మద్ధతు కోరేందుకు అపాయింట్ మెంట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి లేఖలో విజ్ణప్తి చేశారు. సోమవారం అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రిజర్వేషన్ల సాధనకు తాను నాయకత్వం వహిస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కలిసి కట్టుగా అందరం ప్రధాని మోడీ వద్దకు వెళ్దామని ఆయన అన్ని పార్టీలకు పిలుపు నిచ్చారు.

Advertisements
image

బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత

ఆ క్రమంలో ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ ఇప్పించాలని కేంద్ర మంత్రులు జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు ఆయన విజ్ఞప్తి చేశారు. బీసీలకు రిజర్వేషన్లపై పార్టీలకతీతంగా ఐక్యంగా ఉన్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. 1979లోనే ఈ రిజర్వేషన్ల కోసం మండల్‌ కమిషన్‌ వేశారని గుర్తు చేశారు. మండల్‌ కమిషన్‌తోనే బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత అని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో 56.36 శాతం బలహీనవర్గాలు ఉన్నాయని వివరించారు. లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ చెప్పినట్లే.. తెలంగాణలో కులగణన చేశామన్నారు. గతేడాది ఫిబ్రవరి 4న కేబినెట్‌లో తీర్మానం చేశామని చెప్పారు.

Related Posts
Pahalgam Terror Attack : ‘ఎవర్నీ వదిలిపెట్టం’ – ప్రధాని మోదీ స్ట్రాంగ్
Narendra Modi: ఈ నెల 24న బీహార్‌ పర్యటనకు ప్రధాని మోదీ

జమ్ముకశ్మీర్‌లో పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని ఖండిస్తూ, "ఈ దాడి వెనుక ఉన్నవారిని Read more

Sajjala Rama Krishna Reddy: పహల్గామ్ ఉగ్రవాదుల దాడిపై స్పందించిన సజ్జల
Sajjala Rama Krishna Reddy: పహల్గామ్ ఉగ్రవాదుల దాడిపై స్పందించిన సజ్జల

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదనను కలిగించింది. ఈ దాడిలో అమాయకుల ప్రాణాలు పోవడం, భద్రతా వ్యవస్థపై ఉన్న Read more

ఆంధ్రప్రదేశ్‌కు అరుదైన గౌరవం
Etikoppaka Toys Shakatam

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అరుదైన గౌరవం లభించింది. ఈసారి జనవరి 26న ఢిల్లీలో నిర్వహించే రిపబ్లిక్ డే కవాతులో ఆంధ్రప్రదేశ్ తరఫున ఏటికొప్పాక బొమ్మల Read more

Bennylingam: పాస్టర్ ప్రవీణ్‌ మృతిపై పూటకో మాట మాట్లాడుతున్నబెన్నిలింగం
Bennylingam: పాస్టర్ ప్రవీణ్‌ మృతిపై పూటకో మాట మాట్లాడుతున్నబెన్నిలింగం

పోలీసులు విచారణలో ఏమి జరిగిందో తెలుసా? పాస్టర్ పగడాల ప్రవీణ్‌ హత్య కేసులో కొత్త మలుపు తలెత్తింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×