ఏపి లోని రేషన్ కార్డుదారులకు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రజారోగ్యం , పోషకాహారానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు పోషక విలువలు కలిగిన కందిపప్పు , తృణధాన్యాలను అందించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. వచ్చే జూన్ 1వ తేదీ నుండి రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపులలో వీటిని పంపిణీ చేయనుంది.ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా అందిస్తున్న నిత్యావసర సరుకులతో పాటు, రాయితీపై కిలో కందిపప్పు, ఉచితంగా రాగులను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. దీని కోసం రాబోయే మూడు నెలలకు సరిపడా కందిపప్పును , ఏడాదికి సరిపడా రాగులను సేకరించేందుకు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. ఈ టెండర్ల ప్రక్రియ దాదాపు ఒక నెల రోజుల్లో ముగుస్తుంది. ఆ తర్వాత జూన్ 1వ తేదీ నుండి రాష్ట్రంలోని ప్రతి రేషన్ షాపులో లబ్ధిదారులకు కందిపప్పు, రాగులు అందుబాటులో ఉంటాయి. ఈ నిర్ణయం పేద ప్రజల పోషకాహార స్థాయిని మెరుగుపరచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
పథకం
ఇక్కడ రేషన్ షాపుల ద్వారా అందించే బియ్యానికి బదులుగా రాగులను ఉచితంగా పొందే అవకాశం కల్పించింది. దీని ప్రకారం ప్రతినెలా 20 కిలోల బియ్యం తీసుకునే కుటుంబం, ఒకవేళ రెండు కిలోల రాగులను తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తే వారికి ఆ మేరకు బియ్యం కోటాలో తగ్గింపు ఉంటుంది. పౌరసరఫరాల శాఖ ప్రాథమిక అంచనా ప్రకారం ఈ పథకం కోసం సంవత్సరానికి సుమారు 25 వేల మెట్రిక్ టన్నుల రాగులు అవసరం అవుతాయి.ఈ కొత్త విధానం ద్వారా ప్రజలకు పోషక విలువలు కలిగిన రాగులను అందుబాటులోకి తీసుకురావాలనేది ప్రభుత్వ లక్ష్యం. బియ్యం తీసుకోవడానికి ఇష్టపడని లేదా రాగులను ఆహారంలో భాగంగా చేసుకోవాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం. రాగులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కాబట్టి.. ఈ నిర్ణయం ప్రజల ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుంది.చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తోంది.

సంక్షేమ పథకాలు
గత ప్రభుత్వ విధానాల కంటే భిన్నంగా ప్రజలకు మరింత చేరువగా ఉంటూ పాలన సాగిస్తోంది. కేంద్ర ప్రభుత్వం నుండి అవసరమైన సహాయం తీసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ చర్యల ద్వారా రాష్ట్ర ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు వస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది.
Read Aslo :Cinema News: సినిమా సక్సెస్ అవ్వాలని తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ హీరో ఎవరంటే!