రియల్ ఎస్టేట్ సంక్షోభానికి కారణం రేవంత్ రెడ్డి: హరీష్ రావు

రియల్ ఎస్టేట్ సంక్షోభానికి కారణం రేవంత్ రెడ్డి: హరీష్ రావు

తెలంగాణలో రియల్ ఎస్టేట్ సంక్షోభానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కారణమని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఆర్థిక ఇబ్బందులతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటున్న నేపథ్యంలో ఆయన స్పందించారు.

హైదరాబాద్ నగర అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, ప్రభుత్వ పాలన రియల్ ఎస్టేట్ రంగానికి పెద్ద అడ్డంకిగా మారిందని హరీష్ రావు విమర్శించారు. గత ఏడాదిన్నర కాలంగా రియల్ ఎస్టేట్ రంగం క్షీణిస్తోందని వివిధ సర్వే సంస్థలు హెచ్చరించినా, అధికార పార్టీ పట్టించుకోలేదని ఆయన అన్నారు. కొంపల్లి రియల్ ఎస్టేట్ వ్యాపారి వేణుగోపాల్ రెడ్డి, ఆదిభట్ల నరసింహ గౌడ్ మరణాల ఘటనలను ప్రస్తావించిన హరీష్ రావు, సంక్షోభం వేగంగా వ్యాపిస్తున్నదని, వ్యాపారులు తీవ్ర నిరాశలో ఉన్నారని తెలిపారు.

హైడ్రా కూల్చివేతలు, మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్ట్ నిలిపివేత, ఫార్మా సిటీ రద్దు, మెట్రో మార్గ మార్పులు వంటి ప్రభుత్వ నిర్ణయాలు రియల్ ఎస్టేట్‌పై తీవ్ర ప్రభావం చూపాయని ఆయన విమర్శించారు. ఇలాంటి విధానపరమైన తప్పిదాలతో పెట్టుబడిదారులు వెనుకంజ వేస్తున్నారని, రంగం మరింత సంక్షోభంలోకి వెళ్లే ముప్పు ఉందని హెచ్చరించారు. నరసింహ గౌడ్ కుటుంబానికి వెంటనే ఆర్థిక సహాయం అందించాలని, ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. సమస్య మరింత పెరగకుండా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని సూచించారు.

Related Posts
ఈనోకు ఫ్రీ పబ్లిసిటీ – హైదరాబాద్ అంతా హోర్డింగులు
ktr digest the growth posters hyderabad

సినిమా హాళ్లలోనో లేకపోతే టీవీల్లోనే ఈనో ప్రకటన వస్తుంది. భోజనం చేసిన తర్వాత వచ్చే కడుపులో మంటని ఈనో తగ్గిస్తుందని ఆ ప్రకటనల సారాంశం. ఆ ప్రకటలను Read more

ఉస్తాద్‌ జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత
Ustad Zakir Hussain passed away

న్యూఢిల్లీ: ప్రపంచ ప్రఖ్యాత తబలా విద్వాంసుడు ఉస్తాద్‌ జాకీర్‌ హుస్సేన్‌ (73)కన్నుమూశారు. హృద్రోగ సంబంధ సమస్యలతో రెండు వారాలుగా ఆయన అమెరికా శాన్‌ఫ్రాన్సిస్కోలోని దవాఖానలో చికిత్స పొందుతున్నారు. Read more

హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ కుప్పకూలింది – మల్లారెడ్డి
mallareddy hydraa

హైడ్రా ప్రాజెక్టు ప్రారంభమైన తర్వాత హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయిందని బిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. హైడ్రా ఏర్పాటుతో ప్రజల్లో భయాందోళనలు పెరిగాయని, ఫలితంగా రియల్ ఎస్టేట్ Read more

షాంఘై సదస్సు..ఇస్లామాబాద్ చేరుకున్న మంత్రి జైశంకర్..పాక్‌ కీలక వ్యాఖ్యలు
Minister Jaishankar arrived in Islamabad. Pakistan key comments

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో జరుగుతున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీవో) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు భారత విదేశాంగ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ నిన్ననే (మంగళవారం) ఇస్లామాబాద్ చేరుకున్నారు. Read more