Revanth injustice to BCs.. R. Krishnaiah

బీసీలకు రేవంత్ అన్యాయం: ఆర్.కృష్ణయ్య

హైదరాబాద్‌: బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో బీసీ నేత ఆర్.కృష్ణయ్య మీడియాతో మాట్లాడారు. కులగణన లెక్కలపై ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసిన సీఎం రేవంత్‌ రెడ్డి.. దానిని ఎందుకు చట్టం చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలోని బీసీలకు కేసీఆర్ కంటే ముఖ్యమంత్రి రేవంత్ ఎక్కువ అన్యాయం చేస్తున్నారని ఆర్.కృష్ణయ్య విమర్శించారు. బీసీలకు చట్టప్రకారం 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరిగిన కులగణనలో చాలా బీసీ కుటుంబాలు పాల్గొనలేదు. లేదంటే బీసీల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండేది. కులగణనపై చట్టం చేస్తే మేం సుప్రీంకోర్టులో పోరాడుతాం. రాజకీయాలు చేయడం మాకూ వచ్చు అని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

image

కాగా, లోకల్ బాడీ ఎన్నిక ల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్‌ చట్టబద్ధతతో పనిలేకుండా లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున బీసీలకు 42శాతం సీట్లు కేటాయిస్తామని కుండబద్దలు కొట్టారు. బీఆర్ఎస్, బీజేపీలు సైతం 42 శాతం బీసీలకు టికెట్లు కేటాయిస్తారా? అని సీఎం రేవంత్ సవాల్ చేశారు. దీంతో ఇప్పుడు సీఎం సవాల్‌ను బీఆర్ఎస్, బీజేపీ స్వీకరిస్తుందా? బీసీలకు 42 శాతం సీట్లు ఇస్తుందా? అన్న చర్చ నడుస్తున్నది. తాజాగా ఈ అంశంపై ఆర్.కృష్ణయ్య స్పందించడం హాట్ టాపిక్‌గా మారింది.

Related Posts
గేమ్ ఛేంజర్: 4 పాటలకు 75 కోట్లు!
గేమ్ ఛేంజర్: 4 పాటలకు 75 కోట్లు!

రామ్ చరణ్ మరియు కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న గేమ్ ఛేంజర్ చిత్రంలోని నాలుగు పాటలను చిత్రీకరించడానికి దర్శకుడు శంకర్ ₹75 కోట్లు ఖర్చు చేసినట్లు Read more

రైతులకు హరీశ్‌రావు విజ్ఞప్తి
Harish Rao's appeal to farmers

ఆదిలాబాద్‌ జిల్లాలో మరో రైతు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనపై బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు స్పందిస్తూ.. రుణభారం, బ్యాంకుల వేధింపులతో రైతులు ఆత్మహత్యలకు Read more

ఆర్థిక సవాళ్లు ఉన్నా సంక్షేమ పథకాలకే ప్రాధాన్యం: చంద్రబాబు
ఆర్థిక సవాళ్లు ఉన్నా సంక్షేమ పథకాలకే ప్రాధాన్యం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను వివరిస్తూ గత పరిపాలన నుండి వచ్చిన తీవ్రమైన సవాళ్లను నొక్కిచెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో Read more

ఇండియా టుడే సర్వేలో సీఎం చంద్రబాబుకు 4వ స్థానం
TTD and railway services on WhatsApp.. CM Chandrababu

రాష్ట్ర ప్రజలకు గర్వకారణం జాతీయ స్థాయిలో అత్యుత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు నాలుగో స్థానాన్ని దక్కించుకున్నారు. ప్రముఖ మీడియా సంస్థ ఇండియా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *