1.21 లక్షలకు పైగా జాబ్ కార్డులు తొలగింపు!

2023-24 మధ్య కాలంలో తెలంగాణలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి 1,21,422 మంది కార్మికుల పేర్లను తొలగించినట్లు కేంద్రం వెల్లడించింది. లోక్ సభలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(సీపీఐ) ఎంపీ ఎస్.వెంకటేశన్ అడిగిన ప్రశ్నకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేష్ పాశ్వాన్ సమాధానమిచ్చారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 68 లక్షలకు పైగా(68,86,532) మంది కార్మికులను, తొలగించారని, 2022-23లో 86,17,887 మంది కార్మికులను తొలగించారని వెల్లడించారు. ఉపాధి హామీ పథకంలో రాష్ట్రాల వారీగా డేటాను కూడా మంత్రి తెలిపారు. తెలంగాణ నుంచి 1.21 లక్షలకు పైగా జాబ్ కార్డులను తొలగించినట్లు తెలిపారు.

Advertisements
External affairs minister S Jaishankar AFP Photo 1670855879733

నకిలీ,తప్పు జాబ్ కార్డులు, పలు కుటుంబాలు గ్రామాలను శాశ్వతంగా విడిచిపెట్టి వెళ్లడం, గ్రామాలను పట్టణ ప్రాంతాలుగా మార్చడం వంటి కారణాల వల్ల ఉపాధి హామీ పథకంలో తొలగింపులు జరిగాయని మంత్రి చెప్పారు.కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మెటీరియల్ కాంపోనెంట్స్ కోసం పెండింగ్ నిధులు రూ.282.74 కోట్లు, కార్మికులకు ఇవ్వాల్సిన నిధులు రూ.15.46 కోట్లు చెల్లించాల్సి ఉంది.

దేశంలోని గ్రామీణ నిరుద్యోగులకు ఉపాధిని కల్పించడమే లక్ష్యంగా మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చారు. ఇటీవల కాలంలో ఉపాధి హామీ పథకం కోసం వాస్తవ విడుదల మొత్తాలు ప్రారంభ బడ్జెట్ అంచనాలను మించిపోయాయి. దీనిని బట్టి ఉపాధి పొందేవారి సంఖ్య అర్థం అవుతుంది.ఈ పథకం అమలు బాధ్యత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు ఉందని మంత్రి కమలేష్ పాశ్వాన్ వెల్లడించారు. జాబ్ కార్డులను అప్ డేట్ చేయడం తొలగించడం అనేది రాష్ట్రాలు నిర్వహించే ఒక సాధారణ ప్రక్రియ అని తెలిపారు. అయితే జాబ్ కార్డులను తొలగించే సమయంలో నిబంధనలకు అనుగుణంగా ఉండాలని ఆయన సూచించారు. అర్హత కలిగిన కుటుంబాల జాబ్ కార్డులను రద్దు చేయలేమని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేష్ పాశ్వాన్ స్పష్టం చేశారు.

Related Posts
హైడ్రాలో డీఆర్ఎఫ్ పాత్ర చాలా కీలకం: రంగనాథ్
DRF role in HYDRA is crucial.. Ranganath

హైదరాబాద్‌: హైడ్రా నిర్వ‌హిస్తున్న విధుల‌న్నిటిలో డీఆర్ఎఫ్ బృందాల పాత్ర చాలా కీల‌క‌మైన‌ద‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌ అన్నారు. ప్ర‌భుత్వ ల‌క్ష్యాలు, ప్ర‌జ‌ల అంచ‌నాల మేర‌కు హైడ్రా Read more

రాజ్యాంగం ఒక్కటే సకల సమస్యలకు పరిష్కారం – డిప్యూటీ సీఎం భట్టి
bhatti br

జాతి అభ్యున్నతికి విద్య ప్రాధాన్యతను బీఆర్ అంబేద్కర్ బోధించారని, అందుకే ఆయన అనేక విశ్వవిద్యాలయాలను స్థాపించారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూలో Read more

బంద్‌కు పిలుపునిచ్చిన మావోయిస్టులు
Maoists called for bandh

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో హై అలర్ట్‌ హైదరాబాద్‌: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో పోలీసులు హై అలర్ట్‌ ప్రకటించారు. ఎన్‌కౌంటర్లకు నిరసనగా బీజాపూర్‌, సుక్మా, Read more

Telangana Budget : నేడే తెలంగాణ బడ్జెట్.. ఎన్ని లక్షల కోట్లంటే ?
Today Telangana budget.. How many lakh crores is it?

Telangana Budget : ఈరోజు తెలంగాణ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. తెలంగాణ ప్రభుత్వం నేడు అంటే బుధవారం రెండోసారి శాసనసభసలో సంపూర్ణ బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. దీనిపై భారీ Read more

×