కోల్కతా సోషల్ మీడియా (Kolkata Social Media) ఇన్ఫ్లుయెన్సర్ శర్మిష్ఠ పనోలీకి కోర్టు నుంచి ఊరట లభించింది. మత ఉద్రిక్తతలకు దారితీసేలా వీడియో పోస్ట్ చేశారన్న కేసులో ఆమెకు మధ్యంతర బెయిల్ మంజూరైంది.శర్మిష్ఠ పనోలీ (Sharmishtha Panoli) వయసు కేవలం 22 సంవత్సరాలే. అయినా ఆమెపై వచ్చిన అభియోగాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఓ పోస్టుకు స్పందిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు చట్టపరంగా చిక్కుల్లోకి దారితీశాయి.పహల్గామ్ దాడి తర్వాత భారత్ చేపట్టిన చర్యలపై సోషల్ మీడియాలో చర్చ జరిగింది. వాటికే ప్రతిస్పందనగా శర్మిష్ఠ చేసిన వ్యాఖ్యలు తర్వాత పెద్ద దుమారాన్ని లేపాయి.
రెండు వారాల తర్వాత అరెస్ట్
ఈ వ్యాఖ్యల తర్వాత రెండు వారాల గ్యాప్లో మే 31న శర్మిష్ఠను పోలీసులు అరెస్ట్ చేశారు. గురుగ్రామ్లో ఆమెను అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరిచారు.
కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది
న్యాయస్థానం ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆమె అరెస్టు పెద్ద రాజకీయ చర్చకు దారితీసింది.శర్మిష్ఠ అరెస్టును బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఇది ప్రజాస్వామ్యానికి, భావ ప్రకటనకు ముప్పుగా అభివర్ణించింది. మమతా ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి.
అంతర్జాతీయ మద్దతు – నెదర్లాండ్స్ ఎంపీ స్పందన
ఈ వ్యవహారంపై విదేశాల నుంచి కూడా స్పందన వచ్చింది. నెదర్లాండ్స్ ఎంపీ గీర్ట్ వైల్డర్స్ ఆమెకు మద్దతు ప్రకటించారు. ఆమె అరెస్టును భావ ప్రకటన హక్కుపై దాడిగా పేర్కొన్నారు.గీర్ట్ వైల్డర్స్, ప్రధానమంత్రి మోదీకి విజ్ఞప్తి చేశారు. శర్మిష్ఠను వెంటనే విడుదల చేయాలని కోరారు.
Read Also : Konda Surekha : కళ్లు తిరిగి పడిపోయిన కొండా సురేఖ