Release of Indiramma Atmiya Bharosa funds

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు విడుదల

మొత్తం 18,180 మందికి 6 వేల చొప్పున జమ

హైదరాబాద్: ఉపాధి కూలీలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉపాధి కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు విడుదల చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో లేని ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉపాధి కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం నిధులు జమ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ప్రారంభించడం తెలిసిందే.

Advertisements
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు

ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలకు

ప్రతి మండలంలోని ఒక పైలెట్ గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి కూలీల ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమ చేసింది. మొత్తం 18,180 మందికి 6 వేల చొప్పున జమ చేసింది. ఆ తర్వాత శాసన మండలి ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధుల విడుదలకు బ్రేక్ పడింది. అయితే ఎన్నికల కోడ్ అమలులో లేని జిల్లాలకు నిధులు విడుదల చేయాలని మంత్రి సీతక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. దీంతో ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు విడుదలయ్యాయి.

ఇప్పటివరకు మొత్తం 83,420 మంది ఉపాధి కూలీలకు

ఆ రెండు జిల్లాల్లో 66,240 మంది ఉపాధి కూలీ లబ్ధిదారులకు ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు విడుదల చేసింది. దాంతో 66,240 మంది కూలీల ఖాతాల్లో 39.74 కోట్లు జమ అయ్యాయి. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 83,420 మంది ఉపాధి కూలీలకు ప్రభుత్వం 50.65 కోట్లు చెల్లించింది. ఎన్నికల కోడ్ ముగియగానే లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను చెల్లించనున్న ప్రభుత్వం

Related Posts
రాష్ట్రంలో తొలి గులియన్ బారే సిండ్రోమ్ కేసు నమోదు
The first case of Guillain Barre syndrome has been registered in the state

హైదరాబాద్‌: కొన్నిరోజులుగా మహారాష్ట్రను వణికిస్తున్న గులియన్‌ బారే సిండ్రోల్‌ హైదరాబాద్‌కూ వచ్చేసింది. సిద్దిపేటకు చెందిన ఓ మహిళలకు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం బాధితురాలు ఓ ప్రైవేటు Read more

గీతా కార్మికులకు రెండవ విడత కాటమయ్య రక్షణ కవచం కిట్ ల పంపిణీ
Ponnam Prabhakar

చెట్టు ఎక్కినప్పుడు గీతా కార్మికులు ప్రమాదాలకు గురికాకూడదనే సదుద్దేశ్యంతో రూపొందించిన కాటమయ్య రక్షణ కవచం లను బీసీ సంక్షేమ శాఖ రెండో విడత గా 10 వేల Read more

ఎపిక్స్ (EPICS) ప్రోగ్రామ్ ద్వారా సామాజిక పరివర్తనకు మార్గం వేస్తోన్న కెఎల్‌హెచ్‌ విద్యార్థులు
KLH students paving the way

కెఎల్‌హెచ్‌ డీమ్డ్ టు బి యూనివర్శిటీ , తమ వినూత్న ఎపిక్స్ (EPICS- కమ్యూనిటీ సర్వీస్‌లో ఇంజనీరింగ్ ప్రాజెక్ట్‌లు) కార్యక్రమం ద్వారా సామాజిక ప్రభావంతో విద్యాభాసాన్ని సజావుగా Read more

మన్మోహన్ సింగ్‌కు అవమానం: రాహుల్ గాంధీ
మన్మోహన్ సింగ్‌కు అవమానం: రాహుల్ గాంధీ

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అవమానించిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. దశాబ్దం పాటు భారత ప్రధానిగా ఉన్న మన్మోహన్ Read more

Advertisements
×