हिन्दी | Epaper
జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా!

Gold : బంగారం ధరలు తగ్గడానికి కారణాలు..?

Sudheer
Gold : బంగారం ధరలు తగ్గడానికి కారణాలు..?

ఇటీవలి కాలంలో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్న నేపథ్యంలో, గత కొన్ని రోజులుగా ధరల్లో స్పష్టమైన తగ్గుదల కనిపిస్తోంది. ముఖ్యంగా గురువారం ఒక్కరోజే 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.2,180 మేర పడిపోయింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో తులం బంగారం ధర రూ.95,730 వద్ద కొనసాగుతోంది. గత పది రోజులలో సుమారు రూ.5,000 మేర తగ్గిన ఈ ధరలు, వినియోగదారులకు తాత్కాలిక ఉపశమనం ఇచ్చినా, పెట్టుబడిదారుల మదిలో అనేక ప్రశ్నలు మిగిలి ఉన్నాయి.

అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గడం

ధరల పతనానికి అంతర్జాతీయ పరిణామాలే ప్రధాన కారణమని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గడం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి శాంతి చర్చల అవకాశాలు కనిపించడం వంటి అంశాలు బంగారంపై ప్రభావం చూపాయి. అంతేకాక, డాలర్ బలపడటం వల్ల బంగారం వంటి సురక్షిత పెట్టుబడులపై డిమాండ్ తగ్గినట్టు తెలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర ప్రస్తుతం $3,236.94 వద్ద ట్రేడవుతోంది. త్వరలో విడుదల కానున్న అమెరికా ఆర్థిక గణాంకాలు కూడా ధరల మార్పుపై ప్రభావం చూపే అవకాశముంది.

అక్షయ తృతీయ సందర్భంగా ఫుల్ గిరాకీ

ఇక అక్షయ తృతీయ సందర్భంగా దేశవ్యాప్తంగా బంగారానికి మంచి గిరాకీ కనిపించింది. ధరలు పెరిగి ఉన్నప్పటికీ, ఈ పవిత్రమైన రోజున పసిడి కొనుగోలు చేయడం సంప్రదాయంగా భావించే భారతీయులు భారీగా బంగారం కొనుగోలు చేశారు. సుమారు 12 టన్నుల బంగారం (రూ.12,000 కోట్లు విలువ)తో పాటు, రూ.4,000 కోట్ల వెండి అమ్ముడైనట్టు ఆలిండియా జువెలర్స్ అండ్ గోల్డ్‌స్మిత్ అసోసియేషన్ తెలిపింది. మొత్తం రూ.16,000 కోట్ల వరకు విక్రయాలు జరిగాయని అంచనా వేయబడింది. దీని వలన బంగారంపై గిరాకీ యథాతథంగా ఉన్నప్పటికీ, అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో ధరలు తగ్గడం సహజమని చెప్పవచ్చు.

Read Also : April : GST వసూళ్లు ఆల్ టైం రికార్డు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870