కొత్తగా దరఖాస్తు చేసుకున్నా లైసెన్స్ మంజూరులో అంతులేని జాప్యం
అనంతపురం : ఎన్నో దశాబ్దాలుగా ప్రతి ఏటా కోట్లాది రూపాయల ఖర్చుతో సేవా, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రముఖ స్వచ్చంద సంస్థ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (RDT) భవితల్యం ఆగస్టు 16వ తేదిలోగా తేలే అవకాశం కనిపిస్తోంది. ఆర్డిటికి ఎఫ్ ఎస్ ఏ అనుమతులను కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా లేదా అన్నది ఆగస్టు 16వ తేదీలోగా తేల్చే అవకాశం ఉందని తెలియవచ్చింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తరుపున టిడిపి ఎంపిలల బృందం ఎఫ్ సిఆర్ఎ ఉన్నతాధికారులను కలిసి అనుమతులు ఇప్పించే విషయంలో స్పందించకపోతే అనంతపురం జిల్లాకు పెద్ద నష్టం వాటిల్లే అవకాశం ఉంది.
ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున మన ఎంపిలు అందరూ ఆగస్టు 15వ తేది వరకు ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే టిడిపి కూటమి ప్రభుత్వం తరుపున ఎంపి శ్రీకృష్ణదేవరాయలు నేతృత్వంలో ఎంపిలు ఎఫ్సిఆర్ఎ అధికారులను, కేంద్ర మంత్రులను కలిసి ఉన్నారు. సిఎం చంద్రబాబునాయుడు కూడా ఆర్డిటి విషయంలో స్పందించి కేంద్రానికి లేఖ కూడా రాశారు. వైసిపి తరుపున మాజీ
ఎంపి తలారి రంగయ్య, కళ్యాణదుర్గం ప్రాంతంలో ఆర్డిటి కోసం పాదయాత్ర చేశారు. ఈ కార్యక్రమంలో పాలువురు వైసిపి మాజీ ఎంపిలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పలు ప్రజా సంఘాలతోపాటు, స్వచ్చంద సంస్థలు, అన్ని రాజకీయ పార్టీలు మద్దతుగా నిలిచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో అధికార తెలుగుదేశం పార్టీ ఎంపిలు, ఎమ్మెల్యేలు కూడా ఆర్డిటికి ఎఫ్సిఆస్ఏ అనుమతుల విషయంలో సంపూర్ణ మద్దతు ప్రకటించి, వారు కూడా గట్టి ప్రయత్నాలు చేస్తూ వచ్చారు.

ఈ నేపథ్యంలో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కూడా గట్టిగా స్పందించి ఆర్డిటికి ఎఫ్సిఆస్ఏ అనుమతులు ఇప్పిస్తామని ఇందుకోసం కూటమిప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తుందని ప్రకటించారు. ఆర్డిటికి ఎఫ్సిఆస్ఏ అనుమతులు ఇప్పించే విషయంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఇతర ఎంపిలు, ఎమ్మెల్యేలను కలుపుకుని అవసరమైతే ఢిల్లీకి కూడా వెళ్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రముఖ స్వచ్చంద సంస్థ ఆర్డిటికి ఎఫ్సఆస్ఏ అనుమతులను పునరుద్దరించలేమని కొత్తగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :