rashmika post

వైరల్ అవుతున్న రష్మిక పోస్ట్

రష్మిక మందన్నా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నటి. అయితే, ఇటీవల ఆమె పెట్టిన ఒక పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో “దయ ” చూపించండి అంటూ ఓ మెసేజ్ షేర్ చేయగా, ఇది నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. “ఈరోజుల్లో దయ తగ్గిపోతోంది, అందరూ ఒకరిపై ఒకరు దయతో ఉండాలి” అని చెప్పిన ఆమె, తన ధరించిన టీషర్ట్‌పై కూడా ‘Kindful’ అనే పదం ఉంది. దీంతో ఆమె పోస్ట్ వెనుకున్న అర్థం గురించి అభిమానులు, నెటిజన్లు చర్చించుకోవడం మొదలుపెట్టారు.

ఇటీవల రష్మిక, విజయ్ దేవరకొండ కలిసి జిమ్‌కు వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. జిమ్ నుండి బయటకు వచ్చిన సమయంలో రష్మిక కాలికి గాయమై ఇబ్బంది పడుతూ కారు ఎక్కగా, విజయ్ దేవరకొండ మాత్రం సహాయం చేయకుండా కారు లోపల కూర్చోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు విజయ్ పై తీవ్ర విమర్శలు చేశారు. అయితే, విజయ్‌ను ట్రోల్ చేస్తున్న వారికి సమాధానం ఇచ్చేలా రష్మిక “దయగా ఉండండి” అంటూ ఈ పోస్ట్ పెట్టిందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

rashmika vijay
rashmika vijay

ప్రస్తుతం రష్మిక మందన్నా వరుస సినిమాలతో కెరీర్‌లో దూసుకుపోతుంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2’ సినిమాలో శ్రీవల్లి పాత్రలో నటించి భారీ విజయాన్ని అందుకుంది. బాలీవుడ్‌లో కూడా మంచి అవకాశాలను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. ఆమె ప్రస్తుతం ‘ఛావా’ అనే హిస్టారికల్ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందుతుండగా, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

Related Posts
ISRO-NASA ప్రాజెక్టు ఖరీదైన ఉపగ్రహం
ISRO NASA ప్రాజెక్టు ఖరీదైన ఉపగ్రహం

ISRO-NASA ప్రాజెక్టు ఖరీదైన ఉపగ్రహం ప్రతి 12 రోజులకు దాదాపు భూమి మొత్తం మరియు మంచును స్కాన్ చేస్తుంది, అలాగే ఇది అధిక రిజల్యూషన్ కలిగి ఉంటుంది. Read more

మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు
sithakka

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సియోల్ పర్యటన నుంచి వచ్చిన వెంటనే తెలంగాణలో పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయని, Read more

రాజ‌మండ్రిలో గ్రాండ్‌గా ‘గేమ్ ఛేంజ‌ర్‌’ ప్రీరిలీజ్ ఈవెంట్
game changer Pre Release event grand success

సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న భారీ సినిమా 'గేమ్ ఛేంజర్'. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా Read more

పంచాయతీ రాజ్ శాఖ ఈ మైలురాళ్లు దాటింది – పవన్
pawan tirupathi

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే పాలన ప్రారంభమైన తర్వాత పంచాయతీ రాజ్ శాఖ పలు కీలక మైలురాళ్లు దాటిందని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా Read more