ఎక్కడికైనా ప్రయాణించేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణించినపుడే మన ప్రయాణం సుఖంతం అవుతుంది. మీరు ఏప్రిల్లో ఎక్కడికైనా ప్రయాణించాలని ప్లాన్ చేస్తున్నారా… అది కూడా రైలులో ప్రయాణించాలని అనుకుంటున్నారా.. ఇక టిక్కెట్లను మాత్రమే కాకుండా లగేజీకి సంబంధించిన రూల్స్ కూడా తెలుసుకోవడం ముఖ్యం. ఎందుకంటే ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణికులు భారతీయ రైల్వే ద్వారా ప్రయాణిస్తుంటారు, ఒకోసారి బరువైన సామానులను తీసుకెళ్తుంటారు. మీ ప్రయాణం సౌకర్యవంతంగా ఉండేలా ప్రయాణికులు తీసుకెళ్లే లగేజీపై రైల్వేలు పరిమితి విధించాయి.

లగేజీ లిమిట్ వుంది
ఏప్రిల్లో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా: మీరు భారతీయ రైల్వేలో అంటే ట్రైన్ ద్వారా ప్రయాణించాల్సి వస్తే ఇపుడు టికెట్ మాత్రమే కాకుండా లగేజీ లిమిట్ కూడా తెలుసుకోవడం ముఖ్యం. భారతీయ రైల్వే ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే రైల్వే నెట్వర్క్లలో ఒకటి, ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ లగేజ్ లేదా సామాను తీసుకెళ్తుంటారు. ఈ కారణంగా రైల్వే ప్రయాణీకులు తీసుకెళ్లే లగేజీకి ఒక పరిమితి నిర్ణయించాయి. ప్రయాణీకులు పరిమితి కంటే ఎక్కువ లగేజీని తీసుకెళ్తే ఇప్పుడు అదనపు ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది.
ఇండియన్ రైల్వే లగేజీ రూల్స్
వివిధ క్యాటగిరిల కింద ప్రయాణీకులు లగేజీని తీసుకెళ్లడానికి భారతీయ రైల్వే వేర్వేరు పరిమితులు నిర్ణయించాయి. ఏసీ ఫస్ట్ క్లాస్లో ప్రయాణించే ప్రయాణికులు 70 కిలోల వరకు లగేజీని తీసుకెళ్లవచ్చు, ఏసీ 2-టైర్ స్లీపర్ అండ్ ఫస్ట్ క్లాస్ ప్రయాణీకులకు ఈ పరిమితిని 50 కిలోలుగా నిర్ణయించారు. అదేవిధంగా AC 3-టైర్ స్లీపర్, AC చైర్ కార్ & స్లీపర్ క్లాస్ ప్రయాణీకులకు పరిమితి 40 కిలోలు. సెకండ్ క్లాస్ ప్రయాణికులు 35 కిలోల వరకు లగేజీని తీసుకెళ్లవచ్చు. రైల్వేల ఈ రూల్ ప్రకారం ప్రయాణీకులు అదనపు సామాను తీసుకెళ్లకూడదు. దీని వల్ల ఇతర ప్రయాణీకులకు ఎటువంటి అసౌకర్యం ఉండదు. అదనపు లగేజీ తీసుకెళ్లడానికి ఇప్పుడు చార్జెల వసూల్: ప్రయాణీకులు పేర్కొన్న పరిమితి కంటే ఎక్కువ లగేజీతో ప్రయాణిస్తే, అందుకు చార్జీలు కట్టాల్సిందే. భారతీయ రైల్వేల ప్రకారం మీ లగేజీ ఫ్రీ లిమిట్ కంటే కొంచెం ఎక్కువగా ఉంటే మీరు ఫిక్స్డ్ రేటు ప్రకారం సాధారణ లగేజీ ఛార్జీల చెల్లించాల్సి ఉంటుంది. కానీ పేర్కొన్న పరిమితి మించిపోతే మీరు అదనపు చార్జెస్ అంటే 1.5 రెట్లు చెల్లించాల్సి రావచ్చు.
మీరు మీ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు రైల్వే లగేజీ ఆఫీసులో అదనపు లగేజీని బుక్ చేసుకోవడం మంచిది, దీని ద్వారా మీరు ప్రయాణంలో ఎలాంటి సమస్యను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు.
ఏ వస్తువులపై ఫ్రీ బ్యాగేజీ అలవేన్స్ ఉండదంటే..
భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం, కొన్ని వస్తువులు ఫ్రీ లగేజీ అలవెన్స్ పరిధిలోకి రావు. వీటిలో స్కూటర్లు, సైకిళ్ళు మొదలైనవి ఉన్నాయి, వీటిని విడిగా బుక్ చేసుకోవాలి. ఇది కాకుండా మండే పదార్థాలు, గ్యాస్ సిలిండర్లు, పేలుడు పదార్థాలు, ఆసిడ్స్ అండ్ ఇతర తుప్పు పెట్టె పదార్థాలు లేదా లీకేజ్ వంటి కొన్ని ప్రమాదకరమైన ఇంకా నిషేధిత వస్తువులను తీసుకెళ్లడానికి రైల్వేలు అనుమతించవు. 5 నుండి 12 సంవత్సరాల వయస్సు గల పిల్లలకి టికెట్ కేటగిరీ ప్రకారం ఫ్రీ లగేజీ అలవెన్స్ లో సగానికి అర్హులు కానీ పరిమితి 50 కిలోలుగా నిర్ణయించారు.