Rahul Gandhi will come to Telangana today

నేడు తెలంగాణకు రానున్న రాహుల్ గాంధీ

రాత్రి రైల్లో తమిళనాడుకు బయల్దేరనున్న కాంగ్రెస్ అగ్రనేత

హైదరాబాద్‌: కాంగ్రెస్ జాతీయ నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేడు తెలంగాణకు రానున్నారు. సాయంత్రం 5.30 గంటలకు శంషాబాద్ చేరుకోనున్న రాహుల్‌.. చాపర్‌లో వరంగల్ చేరుకోనున్న రాహుల్.. వరంగల్ సుప్రభా హోటల్‌లో కాసేపు విశ్రాంతి తీసుకోనున్నారు. 7:30కి వరంగల్ నుంచి రైలులో చెన్నై వెళ్లనున్నారు. చెన్నై వెళ్తున్న విద్యార్థులతో కలిసి ఆయన ప్రయాణం చేస్తారు. ఈ సందర్భంగా రైల్లోనే విద్యార్థులతో అయన ముఖాముఖి నిర్వహిస్తారు.

image

కాగా, బీసీ కుల గణన అంశంలో ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందని ప్రభుత్వం చెబుతోంది. బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ అంశంపై ప్రజల స్పందనను రాహుల్‌ తెలుసుకొనున్నారు. రైల్వే ప్రైవేటీకరణ అంశంపై రైలు ప్రయాణికుల నుంచి అభిప్రాయాలను సేకరించనున్నారు.

అయితే, ముందుగా హైదరాబాద్‌ నుంచి వరంగల్‌కు రాహుల్ గాంధీ వెళ్లనున్నారు. అనంతరం ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో పాల్గొననున్న రాహుల్‌.. తిరిగి రాత్రి 7.30 గంటలకు మరల చెన్నైకు వెళ్లనున్నట్లు సమాచారం. కాగా, రాహుల్ గాంధీ వెంట సీఎం రేవంత్ సైతం వరంగల్ వెళ్తారా? లేదా అనేది ఇంకా తెలియరాలేదు. కాగా, అటు వరంగల్‌లోనూ రాహుల్‌కు స్వాగతం పలికేందుకు ఉమ్మడి జిల్లా మంత్రులు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Related Posts
జగనన్న కాలనీల్లో భారీ కుంభకోణం : బీజేపీ ఎమ్మెల్యే
A huge scam in Jagananna colonies.. BJP MLA

అమరావతి : బీజేపీ ఎమ్మెల్యే డా.పార్థసారథి జగనన్న కాలనీల భూసేకరణలో భూకుంభకోణంపై విచారణ జరిపించాలని కలెక్టర్ కు వినతపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగనన్న Read more

400 మంది ట్రైనీలను తొలగించిన ఇన్ఫోసిస్
400 మంది ట్రైనీలను తొలగించిన ఇన్ఫోసిస్

భారతదేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీలలో ఒకటైన ఇన్ఫోసిస్, కర్ణాటకలోని మైసూరు క్యాంపస్‌లో దాదాపు 400 మంది ట్రైనీలను తొలగించినట్లు సమాచారం. నివేదికల ప్రకారం, ఎవాల్యూయేషన్ టెస్ట్ లో Read more

వైరల్ : మద్యం మత్తులో మంచు మనోజ్ రచ్చ
manoj video viral

మంచు ఫ్యామిలీలో జరిగిన గొడవల నేపథ్యంలో మంచు మనోజ్‌కు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మంచు మనోజ్ మద్యం Read more

బాలకృష్ణ ను ఎప్పుడు అలాగే పిలవాలనిపిస్తుంది – పవన్
Pawan announced a donation

విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహించిన మ్యూజికల్ నైట్ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే బాలకృష్ణ, సీఎం చంద్రబాబు, నారా లోకేష్ Read more