హైదరాబాద్ : రిజర్వేషన్లు అమలు అయ్యేవరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య (R. Krishnaiah) డిమాండ్ చేశారు. స్థానిక -సంస్థలలో 42 శాతం రిజర్వేషన్ల అమలు, కేంద్ర ప్రభుత్వం బీసీ కుల గణన చేపట్టాలని నిర్ణయించిన అంశాలపై భవిష్యత్తు కార్యాచరణ చర్చించడానికి ఆగస్టు 3న హైదరాబాద్లో రాష్ట్రస్థాయి విస్తృత కార్యవర్గ సమావేశం (Executive meeting) జరపాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సమావేశానికి జిల్లా, మండల, -రాష్ట్రస్థాయి ముఖ్య నాయకులు హాజరుకావాలని కోరారు. ఆదివారం బిసి (BC) భవన్లోజరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాజాగా జరగబోయే స్థానిక సంస్థలలో 42 శాతం బీసీ రిజర్వేషన్లపై అమలుకు తీసుకోవలసిన కార్యచరణ రూపొందించాలన్నారు. 42 శాతం రిజర్వేషన్లు అమలు అయ్యే వరకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ముఖ్య -మంత్రికి విజప్తి చేశారు. బీసీలందరూ ఈ రిజర్వేషన్లు కాపాడుకోవడానికి పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపు నిచ్చారు.

కులగణన చరిత్రాత్మక నిర్ణయం, బీసీలకు అన్ని రంగాల్లో రిజర్వేషన్లపై కేంద్రానికి ఆర్. కృష్ణయ్య (R. Krishnaiah) డిమాండ్
R. Krishnaiah: కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో కులగణన చేపట్టాలని చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నారు. 75 కోట్లకు పైగా ఉన్న బీసీ వర్గాల చిరకాల డిమాండును కేంద్రం గౌరవించినట్లుగా ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంపై ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి ధన్యవాదాలు తెలిపారు. బిసిల విద్య ఉద్యోగ రిజర్వేషన్లపై ఉన్న క్రిమిలేయర్ను తొలగించాలని, బిసిలకు పారిశ్రామిక పాలసీలో 50 శాతం కోటా ఇవ్వాలని, హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిల నియ మాకంలో ఎస్సీ, ఎన్టీ, బీసీ రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలని, ప్రైవేటు రంగంలో ఎస్సి, ఎస్టీ, బీసిలకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలన్నారు. ఈ సమావేశంలో వివిధ బీసీ సంఘాల నాయకులూ గుజ్జ కృష్ణ, నీల వెంకతేష్, అంజి, లింగయ్య యాదవ్, ఆశిష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
బీసీ రిజర్వేషన్ల అమలుపై ఆర్. కృష్ణయ్య ఏం అన్నారు?
42 శాతం రిజర్వేషన్లు అమలయ్యే వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు.
బీసీల కులగణనపై ఆయన స్పందన ఏమిటి?
తెలంగాణలో కులగణన చేపట్టడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొంటూ ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: Bonalu 2025: అంగరంగవైభవంగా లాల్ దర్వాజ మహంకాళి బోనాలు వేడుకలు