Pure EV New Showroom in Khammam

ఖమ్మంలో ప్యూర్ ఈవీ కొత్త షోరూమ్

హైదరాబాద్‌: భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారులలో ఒకటైన ప్యూర్ ఈవీ, ఈరోజు తెలంగాణలోని ఖమ్మం జిల్లా మధిరలో కొత్త షోరూమ్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. వ్యూహాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ షోరూమ్ & సర్వీస్ సెంటర్ 2000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. బ్రాండ్ యొక్క అధునాతన సాంకేతికతను, ఉన్నత శ్రేణి ఉత్పత్తులను డెలివరీ చేయడానికి వినియోగదారులకు అద్భుతమైన ప్రాంగణం ను అందిస్తుంది.

ఈ కొత్త షోరూమ్ ప్యూర్ ఈవీ యొక్క పూర్తి ఉత్పత్తి జాబితా ను ప్రదర్శిస్తుంది, పర్యావరణ అనుకూలమైన , స్వచ్ఛమైన మరియు తక్కువ ఖర్చుతో కూడిన రవాణా పరిష్కారాల కోసం పెరుగుతున్న డిమాండ్‌ ను తీరుస్తుంది . ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీమతి మల్లు నందిని సహా మరియు ఇతర విశిష్ట అతిథులు, ప్రముఖులు పాల్గొన్నారు . గ్రీన్ మొబిలిటీని అభివృద్ధి చేయడంలో మరియు ప్రాంతం యొక్క సుస్థిరత లక్ష్యాలకు దోహదపడటంలో కంపెనీ కార్యక్రమాలను అభినందించారు.

image
image

ప్యూర్ ఈవీ సహ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ శ్రీ రోహిత్ వదేరా ఈ విస్తరణ గురించి తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, “ఆవిష్కరణ మరియు పర్యావరణ పరిరక్షణ పట్ల పూర్తి నిబద్ధతతో నడిచే ప్యూర్ ఈవీ తెలంగాణలోని ఖమ్మంలో కొత్త షోరూమ్‌ను ప్రారంభించడం పట్ల సంతోషం గా ఉంది. ఈ విస్తరణ, ఈ ప్రాంతంలోని ప్రతి ఒక్కరికీ ఎలక్ట్రిక్ మొబిలిటీని అందుబాటులోకి తీసుకురావాలనే మా లక్ష్యం ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అనుమతిస్తుంది. కస్టమర్‌లు ఇప్పుడు సుస్థిరత మరియు అత్యాధునిక సాంకేతికతను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన మా అధిక-పనితీరు గల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల శ్రేణిని సౌకర్యవంతంగా అన్వేషించవచ్చు” అని అన్నారు.

ప్రారంభోత్సవం సందర్భంగా అమ్మ ఫౌండేషన్‌ చైర్మన్‌ శ్రీమతి మల్లు నందిని మాట్లాడుతూ కొత్త షోరూమ్‌తో ఖమ్మంలో ప్యూర్ ఈవీ తమ కార్యక్రమాలను విస్తరించడం అభినందనీయం. ఈ కార్యక్రమం, వారి అధిక పనితీరు మరియు పర్యావరణ అనుకూల ఎలక్ట్రిక్ వాహనాలను తెలంగాణ ప్రజలకు మరింత చేరువ చేయడమే కాకుండా స్వచ్ఛమైన మరియు హరిత భవిష్యత్తు కోసం ప్రభుత్వ లక్ష్యం కు మద్దతు ఇవ్వడానికి బలమైన నిబద్ధతను కూడా ప్రదర్శిస్తుంది. పర్యావరణ అనుకూల ప్రయాణ పరిష్కారాలను అందించడం ద్వారా, ఈ లక్ష్యం ను నిజం చేయడంలో ప్యూర్ ఈవీ కీలక పాత్ర పోషిస్తోంది” అని అన్నారు.

ప్యూర్ ఈవీ నేడు భారతదేశంలోని టాప్ 10 EV 2 వీలర్ల తయారీదారులలో ఒకటిగా నిలిచింది . అత్యాధునిక బ్యాటరీ సాంకేతికత ద్వారా కంపెనీ పురోగతి సాధిస్తోంది, ఇది కార్బన్ డయాక్సైడ్ (CO2) ఉద్గారాలను ఆకట్టుకునే రీతిలో 96,848 టన్నుల మేరకు తగ్గించడంలో సహాయపడింది.

పర్యావరణ పరిరక్షణ పట్ల దాని కొనసాగుతున్న నిబద్ధతలో భాగంగా, ప్యూర్ ఈవీ ప్రస్తుతం ePluto 7G MAX, ePluto 7G, ecoDryft 350, ETRANCE Neo+ మరియు eTryst Xలను అందిస్తోంది. రాబోయే 30 నెలల్లో 250 కొత్త డీలర్‌షిప్‌లను జోడించాలనే లక్ష్యంతో కంపెనీ ఇటీవల ప్రతిష్టాత్మకమైన గ్రోత్ రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించింది. ఈ విస్తరణ దీర్ఘ-శ్రేణి ఎలక్ట్రిక్ స్కూటర్లు, మోటర్ సైకిళ్ళు మరియు పెద్ద B2B కాంట్రాక్టుల కోసం పెరుగుతున్న డిమాండ్‌తో ప్యూర్ ఈవీ యొక్క నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా 320 అవుట్‌లెట్‌లకు పెంచుతుంది.

Related Posts
కొత్త సీఈసీ కోసం ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశం
CEC rajeev

సీఈసీ ఎంపిక కోసం సమావేశం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ రేపు (ఫిబ్రవరి 18) పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో, కొత్త Read more

కాసేపట్లో పెద్దపల్లికి సీఎం రేవంత్
CM to Address Yuva Vikas Me

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో జరుగనున్న యువ వికాసం సభలో ముఖ్యమంత్రి పాల్గొనబోతున్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగా ఉద్యోగాలు పొందిన Read more

తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు: గిరిజ‌నుల‌కు సీఎం సూచ‌న‌
Don't believe false propaganda.. CM advises tribals

గిరిజన హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామంటూ చంద్ర‌బాబు ట్వీట్‌ అమరావతి: గిరిజన ప్రాంతాల్లో 1/70 చట్టాన్ని తొలగించే ఉద్దేశం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వారి Read more

మహారాష్ట్రలోనూ ఓటేయనున్న తెలంగాణ ఓటర్లు
maharashtra polling

మహారాష్ట్ర ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. రాష్ట్రంలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఉద్యమ నుండి పోలింగ్ జరుగుతుంది. మొత్తం 4,136 మంది అదృష్టం పోటీ చేస్తున్నారు. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *