adani

అదానీ గ్రూప్ కంపెనీ సీసీఐ వాటాల కొనుగోలు

గడచిన కొన్ని త్రైమాసికాలుగా దేశంలోని అగ్రవ్యాపారవేత్తల్లో ఒకడిగా ఉన్న గౌతమ్ అదానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని నిరంతరం విస్తరిస్తూనే ఉన్నారు. కీలక రంగాల్లో తన వ్యాపారాలను విస్తరించటానికి ఉన్న కొనుగోలు అవకాశాలను అన్వేషిస్తూ ముందుకు సాగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన కన్ను మరో కంపెనీపై పడింది. వివరాల్లోకి వెళితే.. ఐటీడీ సిమెంటేషన్ ఇండియాలో మెజారిటీ వాటాల కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్ కంపెనీ అయిన రెన్యూ ఎగ్జిమ్ డీఎంసీసీకి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో అదానీ కంపెనీని దక్కించుకోవటానికి మార్గం సుగమం అయ్యింది. దీంతో ITD సిమెంటేషన్ ఇండియాలో 72.64% వాటాను కొనాలని అదానీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ డీల్ కోసం అదానీ ఏకంగా రూ.5,757 కోట్లను ఆఫర్ చేస్తున్నారు. తాజాగా కాంపిటీటివ్ కమిషన్ దీనికి రూట్ క్లియర్ చేయటంతో అదానీ కిట్టీలోకి మరో కంపెనీ వచ్చి చేరనుంది.

కొనుగోలుదారు అయిన అదానీ సంస్థ రెన్యూ ఎగ్జిమ్ DMCC దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో రిజిస్టర్ చేయబడింది. ఐటీడీ సిమెంటేషన్ ఇండియా లిమిటెడ్ అనేది ఒక ఇంజనీరింగ్ అండ్ నిర్మాణ సంస్థ. ఇది భారీ సివిల్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇంజనీరింగ్‌తో పాటు ఇతర కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ఈ సంస్థకు ఇండియాతో పాటు అనేక దేశాల్లో కార్యకలాపాలను కలిగి ఉంది. ఈ క్రమంలోనే అదానీ గ్రూప్ కంపెనీ అయిన రెన్యూ ఎగ్జిమ్ డీఎంసీసీ తాజాగా ఇంజనీరింగ్ అండ్ కన్‌స్ట్రక్షన్ సంస్థ ఐటీడీ సిమెంటేషన్ ఇండియాలో కీలక వాటాలను కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడైంది. ఐటీడీ సిమెంటేషన్ ఇండియాలో 46.64 శాతం వాటాను దాని ప్రమోటర్ల నుంచి రూ.3,204 కోట్లకు ఒక్కో షేరుకు రూ.400 చొప్పున కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజ్ నోటిఫికేషన్‌లో కంపెనీ ఇచ్చిన సమాచారం ప్రకారం వెల్లడైంది.

Related Posts
రేఖ గుప్తా ఆస్తుల విలువ మీకు తెలుసా?
రేఖ గుప్తా ఆస్తుల విలువ మీకు తెలుసా?

దేశ రాజధాని ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా రేఖ గుప్తా కానున్నారు. ఈ గురువారం రాంలీలా మైదానంలో ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. షాలిమార్ బాగ్ అసెంబ్లీ Read more

119 మందితో భారత్ కు రెండో అమెరికా విమానం
119 మందితో భారత్ కు రెండో అమెరికా విమానం

అమెరికాలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టగానే వలసదారులపై ఉరుముతున్న డొనాల్డ్ ట్రంప్.. అనుకున్నట్లుగానే అక్రమంగా నివాసం ఉంటున్న భారతీయుల్ని స్వదేశానికి పంపేస్తున్నారు. ఇప్పటికే 104 మంది వలసదారులతో కూడిన Read more

అమెరికా అక్రమ వలసదారులపై ఈడి దర్యాప్తు
అమెరికాలో ఎవరెవరిని బహిష్కరిస్తున్నారు?

అమెరికాకు భారతీయుల అక్రమ వలసలపై కొనసాగుతున్న దర్యాప్తును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వెల్లడించడంతో, అమెరికా నుంచి భారతీయుల బహిష్కరణ అంశం గురువారం భారత పార్లమెంట్‌లో సంచలనం సృష్టించింది. Read more

ఆలయ కూల్చివేత ఆర్డర్‌కు రుజువు: అతిషి
ఆలయ కూల్చివేత ఆర్డర్‌కు రుజువు: అతిషి

దేశ రాజధానిలో దేవాలయాలు, ఇతర మతపరమైన కట్టడాలను కూల్చివేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆదేశించారని ఆమె చేసిన ఆరోపణలకు తన వద్ద “డాక్యుమెంటరీ ఆధారాలు” ఉన్నాయని Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *