हिन्दी | Epaper
తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్

రూ.100 కోట్లను ఎత్తుకెళ్లిన పుల్లయ్య అరెస్ట్

Sudheer
రూ.100 కోట్లను ఎత్తుకెళ్లిన పుల్లయ్య అరెస్ట్

హైదరాబాద్‌లో చిట్టీల పేరుతో భారీ మోసాన్ని జరిపిన వ్యక్తి పుల్లయ్య గత నెలలో రూ.100 కోట్ల మేర చిట్టీల సొమ్ము వసూలు చేసి పరారయ్యాడు. దాదాపు 2 వేల మంది నుంచి అతడు నగదు సేకరించి, తిరిగి చెల్లించకుండా తప్పించుకున్నాడు. ఈ సంఘటన హైదరాబాద్ వ్యాప్తంగా సంచలనం సృష్టించగా, బాధితులు సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

పోలీసుల దర్యాప్తు – బెంగళూరులో అరెస్ట్

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, ఎట్టకేలకు పుల్లయ్యను బెంగళూరులో అరెస్ట్ చేశారు. అతడితో పాటు రామాంజనేయులు అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వారి ఇద్దరినీ బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. పోలీసుల తీవ్ర గాలింపు తర్వాతనే పుల్లయ్యను పట్టుకున్నట్లు సమాచారం.

చిట్టీల వ్యాపారం ఎలా నడిపాడు?

పుల్లయ్య స్వస్థలం అనంతపురం జిల్లా చందన లక్ష్మీపల్లి గ్రామం. హైదరాబాద్‌లోని ఎస్సార్ నగర్ ప్రాంతంలో చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. రూ. 5 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు చిట్టీలను నడిపేవాడు. తొలివిడతల్లో చెల్లింపులు సక్రమంగా చేయడంతో ఖాతాదారులు పెరిగారు. అయితే, అవే అతడి మోసానికి దారితీశాయి. డబ్బు వసూలు చేసుకున్న తర్వాత ఇల్లు ఖాళీ చేసి ఉడాయించాడు.

18 ఏళ్ల కూలీ నుంచి భారీ మోసగాడిగా మారిన పుల్లయ్య

పుల్లయ్య 18 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చాడు. మొదట్లో అడ్డ మీద కూలీగా పనిచేశాడు. స్థానికులతో పరిచయాలు పెంచుకుంటూ క్రమంగా చిట్టీల వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. విశ్వసనీయత పెంచుకున్న తర్వాత పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేయడం ప్రారంభించాడు. చివరికి రూ.100 కోట్ల మోసం చేసి పారిపోయిన అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని, బాధితులకు న్యాయం చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870