BRS Nirasana

అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన

తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణం నిరసనలతో హోరెత్తింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫార్ములా ఈ-రేసు కేసులో మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుపై (కేటీఆర్) ఏసీబీ కేసు నమోదు చేసినందుకు నిరసన వ్యక్తం చేశారు. “ప్రశ్నిస్తే కేసులా? కక్ష సాధింపు చర్యలేనా?” అంటూ నినాదాలు చేశారు. ఆందోళనలో భాగంగా తమ వెంట తెచ్చిన ప్లకార్డులను భద్రతా సిబ్బందికి అప్పగించి, సభలోకి వెళ్లిపోయారు.

బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో ఫార్ములా-ఈ రేసు అంశంపై చర్చ జరపాలంటూ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ రేసును హైదరాబాద్‌కు తీసుకురావడంలో కేటీఆర్‌ కీలక పాత్ర పోషించారని, కానీ ఇప్పుడు ఆయనపై అక్రమ కేసులు పెట్టడాన్ని ఖండిస్తున్నట్లు ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. ఈ కేసులను రాజకీయ కక్ష సాధింపుగా పేర్కొంటూ అసెంబ్లీలో దీనిపై పూర్తి చర్చ జరగాలని డిమాండ్ చేశారు. ఫార్ములా-ఈ రేసు ద్వారా హైదరాబాద్ నగరానికి ప్రపంచస్థాయి గుర్తింపు వచ్చినట్లు బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. రేసు నిర్వహణ ద్వారా నగరానికి మరింత అభివృద్ధి చోటు చేసుకుందని, ఇది తెలంగాణ ప్రతిష్టను పెంచిందని చెప్పారు. కానీ ఇప్పుడు ఇదే అంశంఫై కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకోవడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఫార్ములా-ఈ రేసును పరిగణలోకి తీసుకుని కేంద్రం కూడా ప్రశంసించిందని, కానీ ఇప్పుడు అక్రమ కేసులు పెట్టడం సరైన విధానం కాదని అభిప్రాయపడ్డారు. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలుగా అభివర్ణించారు. తాము దీనిపై పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు.

Related Posts
ట్రంప్ విధానాలు: అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థుల భవిష్యత్‌ పై సందేహాలు
university

డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్న నేపథ్యంలో, ఆయన నాయకత్వంలో ఆవిష్కరించగల వివిధ విధానాలు, ముఖ్యంగా అంతర్జాతీయ విద్యార్థులపై ప్రభావం చూపించవచ్చని అనుమానాలు Read more

ఆయుష్మాన్ భారత్‌ ద్వారా క్యాన్సర్ చికిత్స
నేడు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం: ఆయుష్మాన్ భారత్‌ ద్వారా క్యాన్సర్ చికిత్స

ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం (World Cancer Day) జరుపుకుంటారు. ఈ రోజును యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ (UICC) ప్రారంభించింది. Read more

గోదావరి, కృష్ణా అనుసంధానం తెలంగాణకు నష్టం
గోదావరి, కృష్ణా అనుసంధానం తెలంగాణకు నష్టం

నీటి కొరతతో బాధపడుతున్న మునుపటి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు జరిగిన అన్యాయాన్ని ఎత్తిచూపుతూ, పాలమూరు ప్రాంతం యొక్క నీటి వనరుల హక్కును భద్రపరచడానికి వేగంగా చర్యలు Read more

మహిళా దినోత్సవం సందర్బంగా ఈ జిల్లాల్లో సెలవు

ఆంధ్రప్రదేశ్‌లో మహిళా దినోత్సవం సందర్భంగా కొన్ని జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ప్రకాశం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఈ రోజు (మార్చి 8) సెలవుగా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *