AP : రక్షణ సిబ్బందికి ఆస్తి పన్ను మినహాయింపు – పవన్ కళ్యాణ్

Read Time:  1 min
Pawan Kalyan కుమారుడు పై స్పందించిన పవన్ కల్యాణ్
Pawan Kalyan కుమారుడు పై స్పందించిన పవన్ కల్యాణ్
FONT SIZE
GET APP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దేశ రక్షణలో సేవలందిస్తున్న సైనికులకు గౌరవంగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల తన అధికారిక ‘X’ (మాజీ ట్విట్టర్) ఖాతాలో ఈ విషయాన్ని ప్రకటించారు. రాష్ట్రం నుంచి భారత రక్షణ దళాల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఆస్తి పన్ను మినహాయింపు కల్పించనున్నట్లు వెల్లడించారు.

ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, పారామిలిటరీ, సీఆర్పీఎఫ్ సిబ్బంది మినహాయింపు

ఈ మినహాయింపు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, పారామిలిటరీ, సీఆర్పీఎఫ్ సిబ్బందికి వర్తించనుంది. వీరి భాగస్వామి లేదా వారితో కలసి సంయుక్తంగా కలిగిన ఇంటిపై పంచాయతీ పరిధిలో ఉంటే ఈ మినహాయింపు వర్తిస్తుంది. ఈ విధానం విధించటంతో డ్యూటీలో ఉన్న రక్షణ సిబ్బంది కుటుంబాలకు ఆర్థికంగా కొంత ఊరట లభించనుంది.

పదవీ విరమణ చేసిన రక్షణ సిబ్బందికి మాత్రమే

ఇప్పటివరకు ఈ సౌకర్యం ప్రధానంగా సరిహద్దుల్లో పనిచేసే లేదా పదవీ విరమణ చేసిన రక్షణ సిబ్బందికి మాత్రమే పరిమితమై ఉండేది. అయితే ఇప్పుడు అధికారిక విధుల్లో ఉండే వారికి కూడా ఈ ప్రయోజనం అందుబాటులోకి రావడం శుభపరిణామంగా భావించబడుతోంది. ఈ నిర్ణయం దేశ రక్షణలో నిబద్ధంగా ఉన్న జవాన్లకు రాష్ట్రం తరఫున గౌరవంగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Read Also : AP : ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా రాయపాటి శైలజ

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.