Property tax collection in Telangana cross Rs. 1000 crore

Telangana: రాష్ట్రంలో రూ.1000 కోట్లు దాటిన ఆస్తిపన్ను వసూళ్లు

Telangana : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఆస్తి పన్నుపై వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ కు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. అయితే జీహెచ్‌ఎంసీ తరహాలో ఆస్తి పన్నుపై వడ్డీలో 90శాతం రాయితీ ఇవ్వాలని పురపాలక శాఖ నిర్ణయించింది. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవడంతో ఆస్తిపన్ను వసూళ్లు రూ.వెయ్యి కోట్లు దాటిందని రాష్ట్ర పురపాలక శాఖ తెలిపింది.

రాష్ట్రంలో రూ.1000 కోట్లు దాటిన

మార్చి 30, 31న సెలువులైనప్పటికీ ఆస్తి పన్ను చెల్లించవచ్చు

రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కలిపి ఇప్పటివరకు రూ.1010 కోట్ల మేర ఆస్తిపన్ను వసూలైనట్లు వెల్లడించింది. మార్చి 31 నాటికి ఆస్తిపన్ను బకాయిలపై 10 శాతం వడ్డీ చెల్లించిన వారికి ఓటీఎస్‌ వర్తిస్తుందని పురపాలకశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో మార్చి 30, 31న సెలువులైనప్పటికీ ప్రజలు ఆస్తి పన్ను చెల్లించవచ్చని తెలిపింది. రెండు రోజుల్లో ఆస్తిపన్ను చెల్లించి వడ్డీపై 90శాతం రాయితీ సద్వినియోగం చేసుకోవాలని పురపాలక శాఖ సూచించింది.

ఓటీఎస్ పథకం ద్వారా 90 శాతం వడ్డీ డిస్కౌంట్

కాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం ఆస్తి పన్ను బకాయిలు దాదాపు రూ.4 వేల కోట్ల వరకు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో ప్రభుత్వానికి సంబంధించిన పన్నులు రూ.3 వేల కోట్లు ఉన్నాయని పేర్కొంది. మిగిలిన రూ.1000 కోట్లు గ్రేటర్‌లోని సుమారు 2 లక్షల మంది నుంచి జీహెచ్‌ఎంసీకి రావాల్సి ఉంది. ఈ పెండింగ్ బకాయిలకు వడ్డీ కలిపితే.. రూ.2500 కోట్ల వరకు అవుతోంది. ఓటీఎస్ పథకం ద్వారా 90 శాతం వడ్డీ డిస్కౌంట్ ఇస్తే రూ.1150 కోట్ల వరకు వస్తుందని అంచనా వేస్తున్నారు.

Related Posts
‘గేమ్‌ ఛేంజర్‌’ లీక్‌పై నిర్మాత ఆవేదన
'Game changer' police instr

రామ్‌ చరణ్‌ (Ram Charan) హీరోగా శంకర్‌ దర్శకత్వంలో దిల్ రాజు (Dil Raju) నిర్మించిన భారీ బడ్జెట్‌ పొలిటికల్‌ డ్రామా 'గేమ్‌ ఛేంజర్‌' (Game Changer Read more

ఇకపై జనసేన రిజిస్టర్డ్ పార్టీ కాదు…గుర్తింపు పొందిన పార్టీ
janasena

జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక గుర్తింపు లభించింది. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు ఈ మేరకు లేఖ పంపిస్తూ, జనసేనకు గాజు గ్లాస్ Read more

బద్వేల్ ఘటన-నిందితుడికి 14 రోజుల రిమాండ్
Shocked by girls death in

బద్వేల్ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఇంటర్ విద్యార్థిని పై విఘ్నేశ్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి అంటించగా..బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ Read more

‘ఐ &బి సీడ్స్’ ను సొంతం చేసుకోవటం ద్వారా కూరగాయలు మరియు పూల విత్తనాల రంగంలో అడుగుపెట్టిన క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్
Crystal Crop Protection entered the vegetable and flower seed sector by acquiring IB Seeds

.అధిక-విలువైన కూరగాయలు మరియు పూల విత్తనాల మార్కెట్‌లో క్రిస్టల్ కార్యకలాపాలను ఈ సముపార్జన బలపరుస్తుంది. .క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ ఇప్పుడు అగ్రి ఇన్‌పుట్‌లో అంటే పంట రక్షణ, Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *