Priyanka is rushing in Wayanad.Lead of more than one lakh

వయనాడ్‌లో దూసుకుపోతున్న ప్రియాంక..లక్ష దాటిన ఆధిక్యం

వయనాడ్‌: వయనాడ్ లోకసభ ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకగాంధీ ఉపఎన్నికల ఫలితాల్లో సత్తా చాటుతున్నారు. ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభించిన తొలి రౌండ్ నుంచి ఆధిక్యంలోనే కొనసాగుతున్నారు. రాహుల్ గాంధీ రాజీనామాతో వయనాడ్ లో ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ లోకసభ స్థానం నుంచి ప్రియాంకగాంధీ పోటీలో నిలిచినప్పటి నుంచి విస్త్రతంగా ప్రచారం చేశారు. సుమారు పదిరోజులు పాటు లోకసభ నియోజకవర్గంలో ఓటర్లను ఓన్ చేసుకునే ప్రయత్నాలు చేశారు.

తొలిరౌండ్ నుంచి ప్రియాంకగాంధీ లీడ్ లో ఉండటమే కాదు ప్రత్యర్థులు ఎవరు కూడా ఆమెకు పోటీ ఇవ్వకపోవడంతో ఉదయం 10గంటల వరకు సుమారు 85వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగారు. ఇది కంటిన్యూ చేస్తే వయానాడ్ నుంచి ప్రియాంక సుమారు లక్షన్నర ఓట్లకు పైగా మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. వయనాడ్ లో ప్రియాంకగాంధీ భారీ మెజార్టీతో దూసుకుపోతుండటంతో కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ప్రియాంకకు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు.

కాగా, వయనాడ్ కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం కావడంతోపాటు ఇప్పటి వరకు ప్రియాంకగాంధీ ప్రత్యక్ష రాజకీయాలలో పోటీ చేయకపోవడం ఇక్కడ ఆమెకు ప్లాస్ పాయింట్స్ అని చెప్పవచ్చు. అందుకే కౌంటింగ్ షురూ అయిన రెండు గంటల్లోనే 50వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయపథంలో ప్రియాంకగాంధీ దూసుకెళ్లారు. వయనాడ్ లోకసభ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంకగాంధీ పోటీ చేస్తుండటంతో సిట్టింగ్ అభ్యర్థిని కాకుండా బీజేపీ నవ్య హరిదాస్ అనే మహిళను బరిలోకి దింపింది. ఇక లెఫ్ట్ పార్టీ నుంచి సత్యన్ మోకేరి ప్రత్యర్థిగా నిలబడ్డారు.

Related Posts
బంగ్లాదేశ్ ప్రభుత్వ నిర్ణయం: కరెన్సీ నోట్లలో మార్పులు
bangladesh notes

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం, దేశ వ్యవస్థాపక పితామహుడు ముజిబుర్ రహమాన్ చిత్రాలను కరెన్సీ నోట్ల నుంచి తొలగించే ప్రణాళికను ప్రారంభించింది. కొత్త కరెన్సీ నోట్లలో రమణీయమైన మత Read more

దేశంలో మ‌హిళా కేంద్రీకృత అభివృద్ధి : ప్రధాని
Rozgar Mela.. PM Modi who gave appointment letters to 71 thousand people

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ "రోజ్‌గార్‌ మేళా" లో భాగంగా ఈరోజు 71 వేల మంది అపాయింట్‌మెంట్ లేఖ‌లు అంద‌జేశారు. ఈ సందర్భంగా ప్రధాని మవ‌ర్చువ‌ల్‌ కార్య‌క్ర‌మాన్ని ఉద్దేశిస్తూ Read more

నేడు నెల్లూరులో పర్యటించనున్న చంద్రబాబు
CM Chandrababu will visit Nellore today

స్వచ్చ ఆంధ్ర–స్వచ్చ దివస్ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు నెల్లూరు జిల్లా కందుకూరులో పర్యటించబోతున్నారు. నేటి ఉదయం 11.45 గంటలకి టీఆర్ఆర్ కళాశాలలో Read more

తెలంగాణలో ఒంటిపూట బడులు ఎప్పటినుండి అంటే?
తెలంగాణలో ఈ నెల 10 నుండి ఒంటిపూట బడులు – విద్యా శాఖ కీలక నిర్ణయం

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత పెరుగుతోంది. గడిచిన కొన్నేళ్లలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వేసవి ప్రారంభానికి ముందే ఎండలు భయపెట్టేలా మారాయి. ఈ తరుణంలో విద్యార్థుల Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *