ప్రయివేట్ భూముల తొలగింపు

ప్రయివేట్ భూముల తొలగింపు నిర్ణయం

పేదలకు, నిజమైన భూ యజమానులకు న్యాయం చేయాలనే లక్ష్యంతో ప్రయివేట్ భూముల తొలగింపు నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ & స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఈ మేరకు గత నెల 17వ తేదీన మెమోను విడుదల చేశామని, నిషేధ ఆస్తుల జాబితా నుంచి ప్రయివేట్ భూములతొలగింపు గురించి స్పష్టమైన మార్గదర్శకాలు అందులో పేర్కొన్నామని తెలిపారు.

గ్రామ కంఠ భూములకు విముక్తి

శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పంచాయతీల్లో గ్రామ కంఠాల్లో ఉన్న ప్రయివేట్ వ్యక్తుల ఆస్తులను కూడా నిషేధ జాబితా నుంచి తొలగించాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. 2015లోనే అప్పటి ప్రభుత్వం 187 జీవో ద్వారా సామాజిక ఆస్తులు మినహా మిగిలిన భూములను తొలగించేందుకు నిర్ణయం తీసుకున్నప్పటికీ, గత ప్రభుత్వం రీ సర్వే పేరుతో రాష్ట్రవ్యాప్తంగా 4,157 ఎకరాలను నిషేధ జాబితాలో చేర్చిందని చెప్పారు. దీని వల్ల సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఇప్పుడు వాటిని పరిశీలించి తొలగించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

అక్రమ భూముల క్రమబద్ధీకరణకు ఒక ఏడాది గడువు

ప్రభుత్వ భూములను ఆక్రమించి ఇళ్లను నిర్మించుకున్న వారికి క్రమబద్ధీకరణ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. వీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి ఏడాది గడువును ఇచ్చినట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేపట్టిన భూముల రీ సర్వే అనేక లోపాలతో నిండి ఉందని, అది భూ యజమానులకు న్యాయం చేసే విధంగా లేకుండా మార్చివేసిందని ఆరోపించారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం సమగ్ర రీ సర్వే ద్వారా భూమి సమస్యలను పరిష్కరించేందుకు కట్టుబడి ఉందని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు.

Related Posts
విజయసాయిరెడ్డిని ఘాటుగా విమర్శించిన అమర్ నాథ్
విజయసాయిరెడ్డిని ఘాటుగా విమర్శించిన అమర్ నాథ్

ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన విషయం వైసీపీ కోటరీ వివాదం. వైసీపీ అధినేత జగన్ చుట్టూ కోటరీ ఉందని, ఆ కోటరీ వల్లే తాను Read more

డోలి లో గర్భిణీని ఆసుపత్రికి తరలించిన గ్రామస్తులు..
villagers rushed the pregnant woman to the hospital in Doli

విశాఖ : స్వాతంత్రం సిద్ధించి 77 సంవత్సరాలు గడుస్తున్నా, ప్రపంచం ఆధునిక పోకడలకు అనుసరిస్తున్నా విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల కష్టాలు మాత్రం తీరడం లేదు. Read more

ఇకపై వారికి నెలకు 2 లక్షల జీతం: ఏపీ ప్రభుత్వం
Salary of Rs 2 lakh per month for cabinet rank holders - AP Govt

అమరావతి: ఏపీలోని కూటమి ప్రభుత్వం వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే కేబినెట్ హోదా ఉన్నవారికి నెలకు రెండు లక్షల జీతం అందించేందుకు చంద్రబాబు కూటమి Read more

మరో పీఎస్‌కు పోసాని కృష్ణమురళి తరలింపు
Posani Krishna Murali transferred to another PS

కర్నూలు: కూటమి సర్కార్‌ పోసాని కృష్ణ మురళి పై వేధింపులు ఆగడం లేదు. కూటమి పార్టీల నేతలు పెట్టిన కేసుల్లో ఆయనకు వరుసగా ఊరటలు దక్కుతుండడం తెలిసిందే. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *