Prime Minister visits AIIMS, inquiries about Vice President health

ఎయిమ్స్‌కు వెళ్లిన ప్రధాని .. ఉపరాష్ట్రపతి ఆరోగ్యంపై ఆరా

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రికి ప్రధాని నరేంద్ర మోడీ వెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని ప్రధాని మోడీ స్వయంగా ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. జగదీప్ ధన్‌ఖడ్‌ ఆరోగ్యంగా ఉండాలని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

డాక్టర్‌ రాజీవ్‌ నారంగ్‌ ఆధ్వర్యంలో చికిత్స

ఆదివారం తెల్లవారు జామున 2గంటల సమయంలో ఛాతిలో నొప్పి రావడంతో జగదీప్ ధన్‌ఖడ్‌ను ఆస్పత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన్ను ఎయిమ్స్‌లోని క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ (సీసీయూ)లో ఉంచి కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్‌ రాజీవ్‌ నారంగ్‌ ఆధ్వర్యంలో చికిత్స అందిస్తున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న ప్రధాని మోడీ ఆస్పత్రికి వెళ్లి ఆరోగ్యంపై ఆరా తీశారు. మరోవైపు, ఈ ఉదయాన్నే కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా ఆస్పత్రికి వెళ్లి ఉపరాష్ట్రపతి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు.

image

పశ్చిమ్ బెంగాల్ గవర్నర్‌గా పనిచేశారు

కాగా, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌కు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. ఉప-రాష్ట్రపతిగా 2022లో ఆయన ఎన్నికైన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అభ్యర్థి మార్గరెట్ అల్వాను ఓడించి, ఆయన ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. దీనికి ముందు పశ్చిమ్ బెంగాల్ గవర్నర్‌గా పనిచేశారు. ఆ సమయంలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, గవర్నర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. సీఎంవో, రాజ్‌భవన్ మధ్య విమర్శలు, ప్రతి విమర్శలతో ఉప్పునిప్పులా పరిస్థితి ఉండేది. ఈ వివాదంతోనే జగదీప్ ధన్‌ఖడ్‌ పేరు మీడియాకెక్కింది.

Related Posts
ఎమ్మెల్సీ ఎన్నికలపై పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం !
Pawan Kalyan key decision on MLC elections!

అమరావతి: ఏపీలో ఎమ్మెల్సీకలకు సమయం దగ్గర పడుతోంది.. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఎన్నికల బరిలో నిలిచేది Read more

శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్లు కలకలం
fake currency racket busted

శ్రీకాకుళం జిల్లాలో ఒకే రోజు నకిలీ నోట్లు చలామణి చేస్తున్న రెండు ముఠాలు పట్టుబడటం జిల్లా వ్యాప్తంగా కలకలాన్ని రేపింది. టెక్కలి డీఎస్పీ మూర్తి, సీఐ అవతారం Read more

పవన్ కళ్యాణ్ పై బూతులు.. పోసాని వీడియోస్ వైరల్
కల కలం రేపుతున్న పవన్ కళ్యాణ్ పోస్ట్

ప్రముఖ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ కావడంతో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) మరియు జనసేన శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో ఆయన టీడీపీ అధినేత Read more

సైబర్ నేరాలకు వ్యతిరేకంగా TGCSB ‘షీల్డ్’
సైబర్ నేరాలకు వ్యతిరేకంగా TGCSB 'షీల్డ్'

TGCSB 'షీల్డ్' సురక్షితమైన మరియు స్థితిస్థాపకమైన డిజిటల్ భవిష్యత్తును నిర్మించడానికి కలిసి పనిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. సైబర్ క్రైమ్ మరియు సైబర్ సెక్యూరిటీ బెదిరింపులు పెరుగుతున్న నేపథ్యంలో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *