modi

బడ్జెట్ పై ప్రధాని మోదీ స్పందన

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. పేదలు, యువత, రైతులు, మహిళలే లక్ష్యంగా బడ్జెట్ లో పలు ప్రతిపాదనలు చేశారు నిర్మలా సీతారామన్. కేంద్ర బడ్జెట్ 2025 ప్రవేశపెట్టిన తర్వాత మొదటిసారి ప్రధాని మోదీ మాట్లాడారు. భారత అభివృద్ధి ప్రయాణంలో ఈ బడ్జెట్ ఓ మైలురాయిగా నిలిచిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ” భారత్ ను అభివృద్ధి పథంలో నడపడంలో ఈ బడ్జెట్ ఓ మైలురాయిగా నిలుస్తుంది.

Advertisements

140కోట్ల మంది భారతీయుల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా ఈ బడ్జెట్ ఉంది. ప్రతి భారతీయుడి కలను ఈ బడ్జెట్ నెరవేరుస్తుందని నేను ఆశిస్తున్నాను. యువత కోసం అనేక విధివిధానాలను రూపొందించను న్నాం. ఇక వికసిత్ భారత్ లక్ష్యాన్ని సామాన్య ప్రజలే నడపనున్నారు. ఇది ప్రజల బడ్జెట్. ఈ బడ్జెట్ వల్ల దేశంలో పెట్టుబడులు, ప్రజల సేవింగ్స్ అధికమవుతాయి” అని వీడియో స్టేట్ మెంట్ ద్వారా ఆయన సందేశాన్ని పంపారు. ఇక ఈ బడ్జెట్ లో వేతనజీవులకు భారీ ఉపశమనం లభించింది. వ్యక్తిగత ఆదాయ పన్ను రూ.12 లక్షల వరకు మినహాయింపు ఇస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.30వేల పరిమితితో పట్టణ పేదలకోసం యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డులు అందిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో పేర్కొన్నారు. విద్యా – మౌలిక వసతులకు ప్రాధాన్యత ఇచ్చారు.

Related Posts
భారతీయులకు జో బైడెన్ శుభవార్త
visa

ట్రంప్ ఎన్నికలో గెలిచి, జనవరిలో కొత్త అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్న తరుణంలో వీసాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని ఆందోనళ చెందే వారికీ జో బైడెన్ Read more

PM Modi: మోదీ విదేశీ టూర్ కోసం రూ. 258కోట్లు ఖర్చు
PM Modi: మోదీ విదేశీ పర్యటనలకు రూ. 258 కోట్లు ఖర్చు కేంద్రం వెల్లడి!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనల ఖర్చు గురించి కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక సమాచారం వెల్లడించింది. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రధాని విదేశీ Read more

మావోయిస్టు ప్రభావిత జిల్లాలసంఖ్య 126 నుంచి 38కి తగ్గింది-కేంద్రం
maoist 38 update

ప్రభుత్వం చేపట్టిన చర్యలలో కనెక్టివిటీకి అధిక ప్రాధాన్యత.దేశంలో ఎల్‌డబ్ల్యూఈ (లెఫ్ట్ వింగ్ ఎక్స్‌ట్రీమిజం) ప్రభావం గణనీయంగా తగ్గిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గత ఆరేళ్లలో మావోయిస్టు ప్రభావిత Read more

అయోధ్య వివాదం పరిష్కారం కోసం దేవుడిని ప్రార్థించాను: సీజేఐ డీవై చంద్రచూడ్‌
Prayed to God for a solution to Ayodhya dispute says CJI Chandrachud

న్యూఢిల్లీ: అయోధ్య తీర్పుపై భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదానికి పరిష్కారం కోరుతూ దేవుడిని ప్రార్థించానని ఆయన చెప్పారు. Read more

Advertisements
×