ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 17న కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో బిజీగా ఉన్న చంద్రబాబు, స్వల్ప విరామం తీసుకుని కుటుంబంతో కలిసి ఐదు రోజుల విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ పర్యటనలో ఆయన తన పుట్టినరోజు అయిన ఏప్రిల్ 20న కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేకంగా సెలబ్రేట్ చేయనున్నట్టు సమాచారం.

మోడీ ఏపీ టూర్ వాయిదా
ఇదిలా ఉంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతికి ఈ నెలలో జరగాల్సిన పర్యటన వాయిదా పడినట్లు సమాచారం. మొదట మోడీ ఈ నెల మూడో వారంలో అమరావతికి వచ్చి రాజధాని అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేయాల్సి ఉంది. అయితే ప్రధాని బిజీ షెడ్యూల్ కారణంగా ఈ పర్యటనను మే 2వ తేదీకి వాయిదా వేశారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మేలో మోడీ పునఃపరిశీలన పర్యటనలో రాజధాని పనులకు తిరిగి నాంది పలకనున్నారు.
అమరావతిలో శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండే
గతంలో, 2016లో నరేంద్ర మోడీ అమరావతిలో శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భం గుర్తుకురావచ్చు. అప్పట్లో దేశంలోని పలు నదుల నుంచి నీరు, పుణ్యక్షేత్రాల నుంచి మట్టి తీసుకురావడం జరగింది. అనంతరం రాజధాని అభివృద్ధిలో జాప్యం వల్ల విమర్శలు ఎదురైనప్పటికీ, తాజా పరిస్థితుల్లో మళ్లీ మోడీని రాజధాని అభివృద్ధికి తీసుకురావాలనే చంద్రబాబు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో అసెంబ్లీ, హైకోర్టు భవనాల నిర్మాణానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం ప్రాధాన్యతను సూచిస్తోంది.