PM Modi will visit Gujarat today and tomorrow

ఈ నెల 29న విశాఖలో పర్యటించనున్న ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ ఈ నెల 29న విశాఖలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అంతేకాక.. విశాఖ నగరంలో ప్రధాని మోడీ రోడ్ షో, బహిరంగ సభకు హాజరుకానున్నారు. ప్రధాని వస్తుండడంతో, ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ప్రసాద్ సమీక్ష నిర్వహించారు. సాయంత్రం 4.30 గంటలకు ఆంధ్రా వర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్ లో మోడీ సభ ఏర్పాటు చేశారు. ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, ఇతర ప్రాజెక్టులకు ఈ సభ నుంచి మోడీ శంకుస్థాపన చేయనున్నారు.

Advertisements

రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో ఈ ప్రాజెక్టుల కోసం ఇప్పటికే 1200 ఎకరాలు కేటాయించింది. గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌లో 20 గిటావాట్‌ల విద్యుత్తును ఎన్టీపీసీ ఉత్పత్తి చేయనుంది. ఈ రెండు భారీ ప్రాజెక్టుల వల్ల నాలుగేళ్లలో 48వేల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. అమరావతి పనులు వచ్చే నెల నుంచి ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అదే సమయంలో కేంద్ర మంత్రివర్గం అమరావతి కి 54 కిలో మీటర్ల మేర కొత్త రైల్వే లైన్ కు ఆమోదం తెలిపింది. ఈ పనుల ప్రారంభం ప్రధానితో చేయించాలని చంద్రబాబు కోరుతున్నారు.

ఇకపోతే..ఏపీకి కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి వరుస గుడ్ న్యూస్ లు అందజేస్తున్న విషయం తెలిసిందే. ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపిన మోడీ..ఆ హామీ ప్రకారం ఏపీకి అందాల్సిన నిధులు , పోలవరం ప్రాజెక్ట్ పూర్తి , పెండింగ్లో ఉన్న పనులు ఇవన్నీ త్వరగా పూర్తి అయ్యేలా దృష్టి పెట్టారు. ఇక సీఎం చంద్రబాబు సైతం కేంద్ర మంత్రులతో ఎప్పటికప్పుడు సమావేశలవుతూ వస్తున్నారు.

Related Posts
ప్రజావాణిలో 27వేలకు పైగా సమస్యలకు పరిష్కారం – డిప్యూటీ సీఎం భట్టి
bhattiprajavani

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజావాణి కార్యక్రమం ఆశాజనక ఫలితాలను సాధిస్తోంది. డిప్యూటీ సీఎం భట్టి తెలిపిన దాని ప్రకారం.. ఈ పథకం ద్వారా 27 వేలకుపైగా సమస్యలు Read more

23న ఏపీ క్యాబినెట్ భేటీ
ap cabinet meeting

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గం ఈ నెల 23న మరోసారి సమావేశం కానుంది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై కీలక నిర్ణయాలు Read more

రన్యా రావు స్నేహితుడు అరెస్టు
డీఆర్‌ఐ దాడులు: రన్యా రావు స్నేహితుడి అరెస్టుతో కొత్త మలుపు

బంగారు అక్రమ రవాణా కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ముఖ్యంగా ఈ కేసులో ప్రముఖ సినీ నటి రన్యా రావు పేరు తెరపైకి రావడంతో, మరింత ఆసక్తిని Read more

తెలంగాణ స్కూల్స్ లలో ఏఐ టెక్నాలజీ
ai technology

తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యలో సంచలనాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో, విద్యారంగాన్ని ఆధునికీకరించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో, రాష్ట్రంలోని Read more

×