అమరావతిలో ప్రధాని మోడీ పర్యటన

అమరావతిలో ప్రధాని మోడీ పర్యటన !

న్యూఢిల్లీ: రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరగనుంది. రాజధాని పనుల్ని వచ్చే నెలలో అట్టహాసంగా ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దానికి ప్రధానిని ఆహ్వానించగా ఆయన అంగీకారం తెలిపినట్టు సమాచారం. తేదీ ఇంకా ఖరారు కాలేదు. తొమ్మిదేళ్ల క్రితం రాజధాని పనులకు ప్రధాని మోడీ చేతుల మీదుగానే ఘనంగా శంకుస్థాపన జరిగింది. రాజధాని నిర్మాణం వేగంగా జరుగుతున్న తరుణంలో అధికారంలోకి వచ్చిన జగన్‌ ప్రభుత్వం అమరావతిపై కక్షగట్టి, ఎక్కడి పనులు అక్కడే నిలిపేసింది. అమరావతి విధ్వంసానికి కంకణం కట్టుకుంది. మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చి, అమరావతి రైతుల ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని చూసింది. అప్పుడు అమరావతి రైతుల ఉద్యమానికి టీడీపీ, జనసేన వంటి పార్టీలతో పాటు బీజేపీ కూడా అండగా నిలిచింది.

Advertisements
అమరావతిలో ప్రధాని మోడీ పర్యటన

రాజధాని పనులకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు ఖరారు

రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధాని పనుల్ని పట్టాలెక్కించేందుకు నడుంకట్టింది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కూడా ఈసారి రాజధానికి పూర్తిస్థాయిలో అండగా నిలిచింది. కేంద్రం చొరవ వల్లే రాజధాని నిర్మాణానికి ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) రూ.15 వేల కోట్ల రుణాన్ని అత్యంత వేగంగా మంజూరు చేశాయి. హడ్కో కూడా రూ.11 వేల కోట్లు ఇచ్చేందుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. గత వైసీపీ ప్రభుత్వం సృష్టించిన అడ్డంకుల్ని ఈ తొమ్మిది నెలల్లో అధిగమించి… రాజధాని పనులకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు ఖరారు చేసింది. రూ.37,702 కోట్ల పనులకు టెండర్లు ఖరారయ్యాయి. అన్ని పనుల్నీ దాదాపు ఒకేసారి ప్రారంభించబోతున్నారు. ఆ కార్యక్రమాన్ని ప్రధాని చేతుల మీదుగా ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Related Posts
Mark Shankar Health : మార్క్ శంకర్ హాస్పటల్ పిక్ వైరల్
mark shankar pic

పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. ఈ సంఘటనతో పవన్ అభిమానుల్లో, కుటుంబసభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. స్కూల్‌లో Read more

పెన్షన్ల తొలగింపుపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ
పెన్షన్ల తొలగింపుపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుట్ర పూరితంగా పెన్షనర్ల జాబితా నుంచి పెన్షనర్ల పేర్లను తొలగిస్తోందనీ, పేదలకు అన్యాయం చేస్తోందని ప్రతిపక్ష వైసీపీ భగ్గుమంటోంది. సోషల్ మీడియాలో విపరీతంగా ఇలాంటి Read more

మరికాసేపట్లో మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్‌ ప్రసంగం..
Trumps speech to the supporters soon

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విజయం దాదాపు ఖాయమైంది. ప్రస్తుతం పెన్సిల్వేనియాలో ట్రంప్‌ ఘన విజయం Read more

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
ఏపీ మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్

ఫిబ్రవరి 27న పోలింగ్ ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరుగబోయే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయ రణంగట్టిన ఉత్కంఠను పెంచాయి. Read more

×