Prashant Koratkar: ఛత్రపతి శివాజీపై అనుచిత వ్యాఖ్యలు.. జర్నలిస్టు అరెస్ట్

Prashant Koratkar: ఛత్రపతి శివాజీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ అరెస్ట్

మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ, ఛత్రపతి శంభాజీ పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నాగ్‌పూర్‌కు చెందిన జర్నలిస్టు ప్రశాంత్ కోరట్కర్ ను తెలంగాణలో అరెస్ట్ చేసినట్టు మహారాష్ట్ర పోలీసులు బాంబే హైకోర్టుకు తెలియజేశారు.

arrested 0


ప్రశాంత్ కోరట్కర్ బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున న్యాయవాది ఎస్. పాటిల్ వాదనలు వినిపించారు. కోరట్కర్ తెలంగాణలో అరెస్టు చేయబడిన విషయాన్ని కోర్టుకు తెలియజేశారు. అయితే, ప్రశాంత్ కోరట్కర్ తరఫున వాదించిన న్యాయవాది సౌరభ్ ఘాగ్ మాత్రం, ఆయన అరెస్టుకు సంబంధించిన ఎలాంటి సమాచారం తమకు అందలేదని చెప్పారు. అనంతరం బాంబే హైకోర్టు కోరట్కర్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది.

మహారాష్ట్ర పోలీసుల ప్రకటన
మహారాష్ట్ర కొల్హాపూర్ ఎస్పీ మహేంద్ర పండిట్ మీడియాతో మాట్లాడుతూ, ప్రశాంత్ కోరట్కర్‌ను తెలంగాణలో అదుపులోకి తీసుకున్నామని, ప్రస్తుతం ఆయనను కొల్హాపూర్‌కు తరలిస్తున్నట్లు ప్రకటించారు. కొల్హాపూర్‌కు చెందిన చరిత్రకారుడు ఇంద్రజీత్ సావంత్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. ఆయన చెప్పిన ప్రకారం, జర్నలిస్టు ప్రశాంత్ కోరట్కర్ తనతో ఆడియో సంభాషణలో అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఈ వ్యాఖ్యలు సమాజంలో శత్రుత్వాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని పేర్కొన్నారు. జర్నలిస్టు ప్రశాంత్ కోరట్కర్ తనపై వచ్చిన ఆరోపణలను పూర్తిగా కొట్టిపారేశారు. నా ఫోన్ హ్యాక్ చేశారు అని పేర్కొన్నారు. వైరల్ అవుతున్న ఆడియో నకిలీది అని అన్నారు. ఇది నా పై కావాలనే పన్నిన కుట్ర అని అభిప్రాయపడ్డారు. కేసు వెనుక రాజకీయ కోణం ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రశాంత్ కోరట్కర్ గతంలో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని సమాచారం. కొందరు జర్నలిస్టులు మాత్రం ఇది మీడియాపై దాడి అంటూ ప్రశాంత్ కోరట్కర్‌కు మద్దతు తెలుపుతున్నారు. మహారాష్ట్ర పోలీసులు కోరట్కర్‌ను విచారించనున్నారు. న్యాయపరమైన దర్యాప్తు తర్వాత తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఈ కేసు మరింత రాజకీయ దుమారాన్ని రేపే అవకాశముంది.

Related Posts
ప్రపంచ కుబేరుల జాబితా.. అరుదైన ఘనతను సొంతం చేసుకున్న జుకర్‌ బర్గ్‌
Zuckerberg passes Bezos to become worlds second richest person

Zuckerberg passes Bezos to become world’s second-richest person న్యూయార్క్‌ : మెటా సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ప్రపంచంలోనే Read more

టన్నెల్ ప్రమాదం.. బురదతో రెస్క్యూకు అంతరాయం
slbc

తెలంగాణలోని SLBC టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికులను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ తీవ్రంగా కొనసాగుతోంది. టన్నెల్ లోపల 14 కిలోమీటర్ల లోతులో బాధితులు ఉన్నట్లు గుర్తించబడింది. Read more

రాజారెడ్డి ఐ సెంటర్ న్ను ప్రారంభించిన జగన్
Raja Reddy Eye Center

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తన పులివెందుల పర్యటనలో భాగంగా అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన రాజారెడ్డి ఐ సెంటర్ ను ప్రారంభించారు. Read more

Uttar pradesh: ప్రియుడి మోజులో భర్తను హతమార్చిన భార్య
Utter pradesh: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ నేవీ ఆఫీసర్ తన భార్యను ఎంతో ప్రేమగా చూసుకున్నాడు. తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి తన Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *