దేశంలో ఆహార సరఫరా తగ్గిందని వస్తున్న వార్తలు తప్పుడు వని. కేంద్ర ప్రభుత్వం ఈ రూమర్లపై ఘాటుగా స్పందించింది.ఆహారధాన్యాలు, నిత్యావసరాలు పుష్కలంగా ఉన్నాయి అని స్పష్టం చేసింది. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు.గురువారం న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు.ప్రస్తుత పరిస్థితిలో ప్రజలను మభ్యపెట్టేందుకే ఇది జరుగుతోందని ఆరోపించారు. నిజానికి, దేశవ్యాప్తంగా నిల్వలు సరిపోయేంతగా ఉన్నాయి.పంజాబ్ వంటి రాష్ట్రాల్లో కూడా ఇదే రూమర్లు వినిపిస్తున్నాయని ఆయన చెప్పారు. “ఇలాంటి వదంతులు నమ్మకండి” అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.”దేశంలో బియ్యం, గోధుమలు, పప్పులు అన్ని అందుబాటులో ఉన్నాయి” అని తెలిపారు.

అవసరమైన దానికంటే ఎక్కువగా నిల్వలున్నాయి అని అన్నారు.కేంద్రం ఈ అంశంపై సమీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.”ప్రతి రాష్ట్రంలో నిల్వలు పరిశీలించాం, ఎక్కడా కొరత లేదు” అని చెప్పారు.గోధుమ, శనగ, పెసరపప్పు, కందిపప్పు అన్నీ నిల్వల్లో ఉన్నాయి. నిత్యవసరాల సరఫరాకు ఎటువంటి అంతరాయం లేదు.మార్కెట్లలో అధిక కొనుగోళ్లు చేయొద్దని మంత్రి సూచించారు. భయం లేకుండా సహజంగా కొనుగోళ్లు చేయాలని పౌరులకు చెప్పారు.ఒక రూమర్ వల్ల మార్కెట్లలో ధరలు పెరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే, ప్రజలు చలించకుండా శాంతంగా ఉండాలన్నారు.”ఆహార సరఫరా పూర్తిగా నియంత్రణలో ఉంది” అని ఆయన చెప్పారు.
ప్రభుత్వం అన్ని అవసరాలకు ముందుగానే సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విషయాన్ని ప్రజల్లోకి చొప్పించాలి. స్థానికంగా ఇలాంటి తప్పుడు వార్తలను కట్టడి చేయాలని సూచించారు.ఆన్లైన్లో తప్పుడు సమాచారం వైరల్ అవుతోంది. ప్రభుత్వ అధికారిక వేదికలనే నమ్మాలని ప్రజలకు హితవు చెప్పారు.ఈ రూమర్లకు బలవకూడదని, అవి ఆర్ధిక పరంగా కూడా నష్టమేనని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా సరఫరా వ్యవస్థ బలంగా ఉందని చెప్పారు.దేశ ఆహార భద్రతకు కేంద్రం గట్టి చర్యలు తీసుకుంటోంది. నిల్వలు తగిన స్థాయిలో ఉండేలా రోజూ సమీక్ష జరుగుతోందన్నారు.ఇంతమంది ప్రజలు ఆధారపడే వ్యవస్థ ఇది. అందుకే ప్రభుత్వ విధానం నిర్ధారితంగా, సమర్థంగా ఉంటుంది అన్నారు.
Read Also : Indian Navy : పాక్ క్షిపణి, డ్రోన్ దాడులకు ప్రతిగా భారత నౌకాదళం ఆపరేషన్