bandivsponnam

బండి సంజయ్‌కి పొన్నం ప్రభాకర్ హెచ్చరిక

తెలంగాణలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. గణతంత్ర దినోత్సవ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన నాలుగు పథకాలపై బీజేపీ నేత బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ఇందిరాగాంధీ ఇండ్ల పథకంపై సంజయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ..బండి సంజయ్‌పై తీవ్రంగా స్పందించారు.

Advertisements
ponnam bandi
ponnam bandi

ఇందిరాగాంధీపై విమర్శలు చేయడం అనుచితం అని పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు కూడా గతంలో ఇందిరాగాంధీని కాళీమాతతో పోల్చారని ఆయన గుర్తుచేశారు. కేంద్రం పథకాల పేర్లు తమ నేతల పేర్లతో ఉంటే సరేనా అని ప్రశ్నించారు. ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలను నిర్లక్ష్యం చేస్తూ వ్యాఖ్యలు చేయడం సహించేది లేదని బండి సంజయ్‌ను హెచ్చరించారు.

తెలంగాణ నుంచి కేంద్రానికి జీఎస్టీ రూపంలో రూ.37,000 కోట్ల ఆదాయం వచ్చినా రాష్ట్రానికి తగిన నిధులు అందించడం లేదని పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కేంద్ర మంత్రులుగా ఉన్న తెలంగాణ ప్రతినిధులు రాష్ట్రానికి అదనపు నిధులు తీసుకురాలేకపోయారని అన్నారు. రాష్ట్ర పథకాలపై విమర్శల బదులు కేంద్రం ఇచ్చిన సహాయంపై సమాధానం చెప్పాలని బండి సంజయ్‌ను నిలదీశారు.

ముందురోజు బహిరంగ సభలో బండి సంజయ్ తనకు మంత్రి పొన్నం ప్రభాకర్‌తో ఎలాంటి విభేదాలు లేవని ప్రకటించినా, తరువాత రోజు వీరి మధ్య మాటల యుద్ధం చోటుచేసుకోవడం గమనార్హం. మేయర్ సునీల్ రావును బీజేపీలో చేర్చుకోవడం వంటి పరిణామాలు రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి. ప్రస్తుతం తెలంగాణలో రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. నిన్నటి వరకు మిత్రులుగా ఉన్న నాయకులు విమర్శలు చేసుకోవడం, మరుసటి రోజే కౌగిలింతలు పడటం ప్రజలను ఆశ్చర్యపరుస్తోంది.

Related Posts
Erthquake : అరుణాచల్ ప్రదేశ్‌లో స్వల్ప భూకంపం
Minor earthquake hits Arunachal Pradesh

Erthquake : ఆసియా దేశాలను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. గత నాలుగు రోజుల నుంచి భూ ప్రకంపనాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా సోమవారం Read more

Yoon Suk Yeol: ద‌క్షిణ‌కొరియా దేశాధ్య‌క్షుడిని తొలగించిన కోర్టు
ద‌క్షిణ‌కొరియా దేశాధ్య‌క్షుడిని తొలగించిన కోర్టు

ద‌క్షిణ కొరియా అధ్య‌క్షుడు యూన్ సుక్ యోల్‌ను ఆ ప‌ద‌వి నుంచి తొల‌గిస్తూ ఆ దేశ రాజ్యాంగ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో Read more

పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన వైసీపీ కార్పొరేటర్లు
YSRCP corporators join Jana

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఒంగోలు మరియు తిరుపతి నగరపాలక సంస్థలకు చెందిన వైసీపీ కార్పొరేటర్లు భారీగా జనసేనలో చేరారు. ఒంగోలు నగరానికి చెందిన Read more

మోక్షజ్ఞ న్యూ లుక్..ఏమన్నా ఉన్నాడా..!!
moksha nandamuri new look

నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా అదిగో..ఇదిగో అనడమే తప్ప మోక్షజ్ఞ ఎంట్రీ మాత్రం జరగకపోవడం Read more

×