తిరుమల కొండపై రాజకీయ వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించం - టీటీడీ ఛైర్మన్

తిరుమల కొండపై రాజకీయ వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించం – టీటీడీ ఛైర్మన్

తిరుమలలో భక్తుల ప్రశాంతతకు భంగం కలిగించేలా ఎవరు రాజకీయ వ్యాఖ్యలు చేసినా ఉపేక్షించబోమని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టంచేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. తిరుమల రాజకీయ వేదిక కాదు. కొండపై ఎవరైనా రాజకీయ ప్రస్థావనలు చేస్తే దానిని తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు.

Advertisements

తిరుమల పవిత్రతను కాపాడటమే తమ తొలి ప్రాధాన్యత అని, అది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా మారకూడదని ఆయన తెలిపారు. ఇటీవల తెలంగాణకు చెందిన నేత తిరుమల కొండపై చేసిన రాజకీయ వ్యాఖ్యల విషయంలో టీటీడీ సీరియస్‌గా వ్యవహరిస్తోందని, ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని ఆయన అన్నారు.

ఇక తిరుమలలో తెలంగాణ భక్తులపై వివక్ష చూపిస్తున్నారని బీఆర్‌ఎస్‌ నేత శ్రీనివాస్ గౌడ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై టీటీడీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరుమల ప్రతి భక్తుడికి సమానమైన సేవలందిస్తుందని బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. టీటీడీ సేవల విషయంలో ప్రాంతీయ వివక్ష అంటూ ఉండదని ఆయన ఖండించారు. తిరుమలలో భక్తుల కోసం ఏర్పాట్లు, సేవలు, నియమాలు ఖచ్చితంగా పాటించాలనే ఉద్దేశ్యంతోనే నిర్వహణ సాగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. కొండపై ప్రశాంత వాతావరణాన్ని కాపాడటమే తమ బాధ్యత అని, ఇలాంటి రాజకీయ వ్యాఖ్యలు తిరుమల పవిత్రతను మసకబార్చేలా మారవద్దని కోరారు. ఈ పరిణామంతో తిరుమల కొండపై రాజకీయ ఆరోపణలు, వివాదాలు చోటు చేసుకోవడం దురదృష్టకరమని భక్తులు పేర్కొన్నారు. తిరుమలలో రాజకీయం కాకుండా ఆధ్యాత్మికతే ముఖ్యమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Related Posts
Telangana: తెలంగాణలో మొదలైన ధాన్యం కేంద్రాలు
తెలంగాణలో ప్రారంభమైన ధాన్యం కొనుగోలు కేంద్రాలు

తెలంగాణలోని రైతుల కోసం రబీ సీజన్‌లో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. వరి కోతలు ప్రారంభం అవ్వడంతో, మార్కెట్‌లో ధరలు Read more

నిలిచిపోయిన టీడీపీ అధికారిక యూట్యూబ్ ఛానల్
TDP Youtubechannel

టీడీపీ అధికారిక యూట్యూబ్ ఛానల్ సేవలు అనూహ్యంగా నిలిచిపోయాయి. ఇది టీడీపీ కార్యకర్తలు, పార్టీ వర్గాల్లో ఆందోళనకు గురిచేసింది. ఉదయం నుంచి ఛానల్ పూర్తి స్థాయిలో పనిచేయకుండా, Read more

కుల గణన సర్వే నివేదికను ప్రవేశపెట్టిన సీఎం..
CM Revanth Reddy introduced the caste enumeration survey report

హైదరాబాద్‌: తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కులగణన సర్వే 2024ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. సర్వే ప్రకారం Read more

ఏపీ హైకోర్టులో ఇద్దరు న్యాయమూర్తుల ప్రమాణం..
Two judges who took oath in AP High Court

అమరావతి : ఏపీ హైకోర్టులో ఇద్దరు న్యాయమూర్తులు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా అవధానం హరిహరనాథ శర్మ , డాక్టర్‌ యడవల్లి Read more

×