మోదీకి బార్బడోస్‌ అత్యున్నత పురస్కారం

మోదీకి బార్బడోస్‌ అత్యున్నత పురస్కారం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం లభించింది. బార్బడోస్ దేశం ప్రధాని మోదీకి ప్రతిష్టాత్మకమైన ‘ఆనరరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడం ఆఫ్ బార్బడోస్’ పురస్కారాన్ని ప్రదానం చేసింది. కొవిడ్ మహమ్మారి సమయంలో సమర్థమైన వ్యూహాత్మక నాయకత్వం, విలువైన సహాయాన్ని గుర్తింపుగా ఈ అవార్డును ప్రధానం చేశారు. బ్రిడ్జ్‌టౌన్‌లో జరిగిన కార్యక్రమంలో మోదీ తరపున విదేశాంగ సహాయ మంత్రి పబిత్రా మార్గెరిటా ఈ పురస్కారాన్ని స్వీకరించారు.

Advertisements

అవార్డు  ప్రకటన

2024 నవంబర్ 20న గయానాలో జరిగిన రెండో ఇండియా-CARICOM లీడర్స్ సమ్మిట్ సందర్భంగా బార్బడోస్ ప్రధాని మియా అమోర్ మోట్లీ ఈ అవార్డును ప్రకటించారు. మహమ్మారి సమయంలో అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడంలో మోదీ చేసిన కృషిని గుర్తిస్తూ ఈ గౌరవాన్ని అందజేశారు. భారతదేశం-బార్బడోస్ మధ్య సంబంధాలను మరింత బలపరిచేలా ఈ పురస్కారం నిలుస్తుందని ప్రధాని మియా మోట్లీ తెలిపారు.

మోదీ స్పందన

ఈ అరుదైన గౌరవంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. బార్బడోస్ ప్రభుత్వానికి, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అవార్డును 1.4 బిలియన్ల భారతీయులకు అంకితం చేస్తున్నానని, భారతదేశం-బార్బడోస్ మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలకు ఈ గుర్తింపు సంకేతమని మోదీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

భారతదేశం-బార్బడోస్ సంబంధాలు

భారతదేశం-బార్బడోస్ మధ్య 1966 నుంచి దౌత్య సంబంధాలు కొనసాగుతున్నాయి. అభివృద్ధి సహకారం, వ్యాపార ఒప్పందాలు, ఆరోగ్యరంగ సహాయాలు, విద్య సహకారం వంటి విభాగాల్లో ఉభయ దేశాలు అనేక ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. బార్బడోస్ సహా కరీబియన్ దేశాలకు భారతదేశం కొవిడ్-19 మహమ్మారి సమయంలో టీకాలు, వైద్య సామగ్రి, ఆర్థిక సహాయం అందించింది.

ప్రధాని మోదీకి లభించిన ఈ పురస్కారం భారతదేశం యొక్క అంతర్జాతీయ నాయకత్వానికి, సహకార దృక్పథానికి నిదర్శనం. మహమ్మారి సమయంలో భారతదేశం అందించిన సహాయం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ పురస్కారం బార్బడోస్-భారతదేశాల మధ్య స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో కీలకంగా మారనుంది.విలువైన సహాయాన్ని గుర్తింపుగా ప్రతిష్టాత్మకమైన ‘గౌరవ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్’ అవార్డును ప్రదానం చేసింది.ప్రధానమంత్రి తరపున అవార్డును అందుకున్న మార్గెరిటా.. ఈ గుర్తింపునకు కృతజ్ఞతలు తెలిపారు. “ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరుఫున ప్రాతినిధ్యం వహించడం, ఆయన తరపున ఈ ప్రతిష్టాత్మక అవార్డును స్వీకరించడం ఒక గొప్ప గౌరవం” అని పేర్కొన్నారు.

Related Posts
Wagah Border: కేంద్రం సంచల నిర్ణయం.. వాఘా బోర్డ‌ర్‌ను మూసివేసిన పాకిస్థాన్
కేంద్రం సంచల నిర్ణయం.. వాఘా బోర్డ‌ర్‌ను మూసివేసిన పాకిస్థాన్

పెహ‌ల్గామ్ ఉగ్ర‌దాడి నేపథ్యంలో వాఘా బోర్డ‌ర్‌ను మూసివేస్తున్న‌ట్లు పాకిస్తాన్ ప్ర‌క‌టించింది. నేష‌న‌ల్ సెక్యూటీ క‌మిటీ(ఎన్ఎస్సీ) స‌మావేశం త‌ర్వాత ఈ నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. క‌శ్మీర్‌లో జ‌రిగిన దాడి త‌ర్వాత Read more

Donald Trump: వందల వీసాలు రద్దు.. అందులో భారత విద్యార్థులే ఎక్కువ
వందల వీసాలు రద్దు.. అందులో భారత విద్యార్థులే ఎక్కువ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ విధానాల కారణంగా అమెరికాలో వందలాది అంతర్జాతీయ విద్యార్థుల విద్యా వీసాలు రద్దయ్యాయి. వీరిలో సగం మంది భారతీయులేనని అమెరికన్ ఇమిగ్రేషన్ Read more

నేడు ప్రవాసీ భారతీయ అవార్డులను ప్రదానం
నేడు ప్రవాసీ భారతీయ అవార్డుల ప్రదానం

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు ఒడిశాలో నిర్వహిస్తున్న 18వ ప్రవాసీ భారతీయ దివస్ (పిబిడి) సదస్సు ముగింపు సమావేశంలో ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డులను ప్రదానం Read more

IPL 2025: కోల్‌కతాపై పంజాబ్‌ కింగ్స్‌ సంచలన విజయం
IPL 2025: అత్యధిక స్కోర్‌ ను ఛేదించిన టీమ్‌గా పంజాబ్ కింగ్స్ రికార్డ్

ఐపీఎల్ 2025 సీజన్‌లో ముల్లాన్‌పూర్‌ మహారాజా యాదవీంద్ర సింగ్ స్టేడియంలో పిచ్‌పై పంజాబ్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌) మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో పంజాబ్ Read more

Advertisements
×