PM Modi will watch The Sabarmati Report in Parliament

పార్లమెంట్‌లో ‘ది సబర్మతి రిపోర్ట్‌’ను వీక్షించనున్న ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: గుజరాత్‌ అల్లర్లు, గోద్రా రైలు దహన కాండను ఆధారంగా చేసుకొని తెరకెక్కిన తాజా చిత్రం ‘ది సబర్మతి రిపోర్ట్‌’. ఈ చిత్రాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈరోజు వీక్షించనున్నారు. పార్లమెంట్‌ హౌస్‌ కాంప్లెక్స్‌లోని బాలయోగి ఆడిటోరియం లో సోమవారం సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక స్క్రీనింగ్‌ ఏర్పాటు చేశారు. ఈ స్క్రీనింగ్‌కు ప్రధాని మోడీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా సహా పలువురు సభ్యులు హాజరుకానున్నట్లు తెలిసింది.

Advertisements

కాగా, 2002లో ఫిబ్రవరి 27న గుజరాత్‌లోని గోద్రా రైల్వేస్టేషన్ నుంచి అహ్మదాబాద్‌కు వెళ్లేందుకు సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు బయలుదేరుతుండగా ఎవరో చైన్‌ లాగడంతో రైలు నిలిచిపోయింది. ఒక్కసారిగా కొన్ని బోగీలపై రాళ్ల వర్షం మొదలైంది. ఎవరో దుండగులు ఓ బోగీపై పెట్రోల్‌ చల్లి నిప్పు పెట్టారు. దాంతో ఆ బోగీలోని 59 మంది సజీవదహనమయ్యారు. ఈ రైలు అయోధ్య నుంచి తిరిగి వస్తున్న యాత్రికులతో ఉంది. ఆ ఘటనను ఆధారంగా చేసుకుని బాలీవుడ్‌ దర్శకుడు ధీరజ్‌ సర్నా ‘ది సబర్మతి రిపోర్ట్‌’ను తెరకెక్కించారు.

12th Fail మూవీ ఫేమ్‌ విక్రాంత్‌ మాస్సే, రాశీఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం నవంబర్‌ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంపై మోడీ ఇప్పటికే ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. కల్పిత కథనాలు పరిమిత కాలమే కొనసాగుతాయని అన్నారు. సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

Related Posts
చైనా దురాక్రమణపై జపాన్ – ఫిలిప్పీన్స్ రక్షణ సహకారం
చైనా దురాక్రమణపై జపాన్ - ఫిలిప్పీన్స్ రక్షణ సహకారం

జపాన్, ఫిలిప్పీన్స్ మధ్య రక్షణ సహకారం పెరుగుతోంది. చైనా దురాక్రమణ చర్యలపై ఆందోళనలు పెరగడంతో, ఇరుదేశాలు పరస్పర సహకారాన్ని మరింతగా బలోపేతం చేసుకోవడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. భాగస్వామ్య Read more

Delhi: నాలుగు అంతస్తుల బిల్డింగ్‌ కూలిన ఘటనలో 11 మంది మృతి
Delhi: నాలుగు అంతస్తుల బిల్డింగ్ కూలిన ఘటనలో 11మంది మృతి

ఢిల్లీలోని ముస్తఫాబాద్ ప్రాంతంలోని శక్తివిహార్ లో జరిగింది ఘోరమైన విషాదం. ఒక నాలుగు అంతస్తుల భవనం సడెన్‌గా కూలిపోయింది, ఈ ప్రమాదంలో మొత్తం 11 మంది ప్రాణాలు Read more

అటవీ విస్తీర్ణాన్ని తగ్గించవద్దు: సుప్రీం ఆదేశం
suprem court

అటవీ విస్తీర్ణాన్ని తగ్గించే ఏ పని చేయొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. అటవీ విస్తీర్ణాన్ని తగ్గించే ఏ చర్యలనైనా నిషేధిస్తున్నట్లు పేర్కొంది. అటవీ (సంరక్షణ) Read more

నేడు శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ సీ-59 ప్రయోగం
ISRO Set to Launch PSLV C59

శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పీఎస్ఎల్వీ సీ-59 రాకెట్‌ను నేడు నింగిలోకి పంపనుంది. ఈ రాకెట్ ప్రయోగం సాయంత్రం Read more

Advertisements
×