PM Modi Speaks On The India Century At NDTV World Summit

ప్ర‌పంచానికి భార‌త్ ఆశను క‌ల్పిస్తోంది: ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఎన్డీటీవీ నిర్వ‌హిస్తున్న స‌ద‌స్సులో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వివిధ ర‌కాల స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతున్న ప్ర‌పంచానికి భార‌త్ ఆశను క‌ల్పిస్తోంద‌ని అన్నారు. భార‌త స‌ర్కారు అసాధార‌ణ రీతిలో ప‌నిచేస్తోంద‌ని, ప్ర‌తి రంగంలోనూ వేగం పెంచిన‌ట్లు ఆయ‌న చెప్పారు. మూడ‌వ సారి తాము అధికారంలోకి రావ‌డం వ‌ల్ల భార‌త వృద్ధి రేటు వేగంగా జ‌రుగుతున్న‌ట్లు అనేక సంస్థ‌లు అంచ‌నా వేశాయ‌న్నారు.

డ‌బుల్ ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌తో భార‌త్‌కు అడ్వాంటేజ్ జ‌రుగుతోంద‌ని, ఏఐ టెక్నాల‌జీతో పాటు ఆస్పిరేష‌న‌ల్ ఇండియాగా దేశం మారుతోంద‌న్నారు. దేశ ప్ర‌జ‌లు విక‌సిత్ భార‌త్ గురించి చ‌ర్చిస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. జ‌న శ‌క్తితో రాష్ట్ర శ‌క్తి సాధిస్తున్న‌ట్లు ఉంద‌న్నారు. ఊహాజ‌నితంగా సంబంధాల‌ను పెంచుకోబోమ‌ని, త‌మ బంధాల‌న్నీ న‌మ్మ‌కం, విశ్వాసం మీద ఆధార‌ప‌డి ఉంటాయ‌ని ప్ర‌ధాని మోడీ తెలిపారు.

ప్ర‌జాస్వామ్య విలువ‌లు, డిజిట‌ల్ ఇన్నోవేష‌న్‌.. స‌హ‌జీవ‌నం చేయ‌గ‌ల‌వ‌ని భార‌త్ నిరూపించిన‌ట్లు ప్ర‌ధాని చెప్పారు. టెక్నాల‌జీతో స‌మ‌గ్ర‌త సాధించాల‌ని, కానీ దాన్ని నియంత్ర‌ణ‌కు, విభ‌జ‌న‌కు వాడ‌రాద‌న్న ఉద్దేశాన్ని భార‌త్ చూపించిన‌ట్లు ప్ర‌ధాని తెలిపారు. త‌మ ప్ర‌భుత్వానికి రెస్ట్ అనేది లేద‌ని, భార‌త దేశ క‌ల‌ల‌ను నిజం చేసే వ‌ర‌కు విశ్ర‌మించ‌బోమ‌న్నారు.

ఈ కార్యక్రమానికి ముందు ఆయన సదస్సులో పాల్గొనడానికి వచ్చిన విదేశీ అతిథులను కలుసుకొన్నారు. రెండ్రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో యూకే మాజీ ప్రధాని డేవిడ్‌ కామరూన్‌, భూటాన్‌ ప్రధాని దాసో త్సేరింగ్‌ టోబ్గే, విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌, భారతీ ఎయిర్‌టెల్‌ ఛైర్మన్‌ సునీల్‌ మిత్తల్‌ తదితరులు పాల్గొననున్నారు.

Related Posts
దావోస్ లో ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు ఇవే..!
telangana govt agreement in

దావోస్ పర్యటన లో సీఎం రేవంత్ బృందం సత్తా చాటుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తూ అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది. Read more

భక్తులు ప్రాణాలు కోల్పోవడం విచారకరం: జగన్‌
It is sad that devotees lost their lives.. Jagan

అమరావతి: తిరుమల వేంకటేశ్వరస్వామి వైకుంఠ దర్శనం కోసం తిరుపతిలో టోకెన్లు జారీచేస్తున్న కేంద్రం వద్ద తొక్కిసలాటలో భక్తులు మరణించడంపై వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి Read more

కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌‌తో ఎంపీ ఈటల రాజేందర్ భేటి
MP Etela Rajender met with Union Railway Minister Ashwini Vaishnav

న్యూఢిల్లీ: కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌‌ను బీజేపీ కీలక నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం ఢిల్లీలోని Read more

కత్తితో బీభత్సం సృష్టించిన దుండగుడు
కత్తితో బీభత్సం సృష్టిస్తున్నదుండగుడు

ఓ సీరియల్ కిల్లర్ నగరంలో బీభత్సం సృష్టించాడు. కనిపించినవారిని, ఎదురొచ్చిన వారిని కత్తితో దాడి చేశాడు. అరగంటలో ఐదుగురిపై దాడి చేసి పరారయ్యాడు. దీంతో నగరం మొత్తం Read more