Former MLA Jaipal Yadav

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. మరో బీఆర్‌ఎస్‌ నేతకు నోటీసులు జారీ

హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఇప్పటీకే బీఆర్‌ఎస్‌ నేత కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌కు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు శనివారం జూబ్లీహిల్స్‌ పోలీసుల ఎదుట జైపాల్ యాదవ్ విచారణకు సైతం హాజరయ్యారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఇదే కేసులో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు జారీ చేయగా, ఆయన కూడా విచారణకు హాజరయ్యారు. అయితే నోటీసులు అందుకున్న వెంటనే జైపాల్ యాదవ్ విచారణకు హాజరయ్యారు. జూబ్లీ సీసీపీ వెంకటగిరి జైపాల్ యాదవ్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు.

Advertisements

మరోవైపు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసును కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. ఈ కేసులో ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు అరెస్ట్ కాగా.. రాజకీయ నాయకులు కూడా అరెస్ట్ అవుతారంటూ కాంగ్రెస్ నేతలు ప్రకటిస్తూ వస్తున్నారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) చీఫ్ ప్రభాకర్‌రావు అమెరికాలో ఉన్నారు. ఆయనను రప్పించేందుకు కాంగ్రెస్‌ సర్కార్‌ ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు పోలీసులు ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన నలుగురి కాల్ డేటాలు విశ్లేషిస్తున్న అందులోని వివరాల ఆధారంగా ఒక్కొక్కరికీ నోటీసులు ఇస్తూ విచారిస్తున్నారు. కాగా, ఇటీవలే ఫోన్ టాపింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విచారించి స్టేట్ మెంట్ రికార్డు చేసిన విచారణ అధికారి… ఇప్పుడు కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ను విచారణకు పిలిచారు.

Related Posts
కేబుల్ ఆపరేటర్లకు రూ.100 కోట్ల పెనాల్టీ రద్దు: జీవీ రెడ్డి
Cancellation of Rs.100 crore penalty for cable operators.. GV Reddy

అమరావతి: ఏపీ ఫైబర్‌నెట్‌కు సంబంధించి ఛైర్మన్ జీవీ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గత ప్రభుత్వం కొంతమంది కేబుల్ ఆపరేటర్లకు విధించిన రూ.100 కోట్లు పెనాల్టీలను Read more

జమిలి ఎన్నికలతో చాలా ప్రమాదం – బీవీ రాఘవులు
CPI BV Raghavulu Key Commen

జమిలి ఎన్నికలతో దేశానికి చాలా ప్రమాదమని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నికలను దేశంలోని అన్ని పార్టీలను వ్యతిరేకిస్తున్నాయని Read more

జాకీర్ హుస్సేన్ మృతి పట్ల చంద్రబాబు, లోకేశ్ ల సంతాపం
zakir hussain

ప్రముఖ తబలా విద్వాంసులు జాకీర్ హుస్సేన్ మృతి చెందడంపై పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ సంతాపం వ్యక్తం Read more

ముంబైలో ఘోర బోటు ప్రమాదం..
mumbai boat accident

ముంబైలో బుధవారం మధ్యాహ్నం ఓ బోటు మునిగింది.ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో 77 మందిని రక్షించగా, 12 మందిని ఇంకా వెతుకుతున్నారు. ఈ సంఘటన Read more

Advertisements
×