EPFO: ఉద్యోగులు, కార్మికులకు ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) శుభవార్త తెలిపింది. ఏటీఎం, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(యూపీఐ) ద్వారా డబ్బును విత్డ్రా చేసుకునే విధానాన్ని ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ సందర్భంగా కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ కార్యదర్శి సుమితా దావ్రా మాట్లాడుతూ.. ఈ ఏడాది మే లేదా జూన్ నెలాఖరు నుంచి యూపీఐ, ఏటీఎంల ద్వారా ఉద్యోగులు తమ పీఎఫ్ సొమ్మును నేరుగా విత్డ్రా చేసుకోవచ్చునని తెలిపారు. మన బ్యాంకు ఖాతాలో నుంచి తీసుకున్న మాదిరిగానే పీఎఫ్ ఖాతా నుంచి కూడా నేరుగా డబ్బులు ఏటీఎం కేంద్రాలతో పాటు గూగుల్ పే, ఫోన్పే లాంటి యూపీఐ యాప్ల ద్వారా డబ్బు డ్రా చేసుకోవచ్చు.

యూపీఐ ద్వారా పీఎఫ్ ఉపసంహరణ..హైలెట్స్
.యూపీఐ ద్వారా నగదు విత్డ్రా – ఇకపై ఉద్యోగులు ఏటీఎం లేదా యూపీఐ ద్వారా తమ పీఎఫ్ నిధులను ఉపసంహరించుకోవచ్చు.
.పీఎఫ్ బ్యాలెన్స్ చెకింగ్ సదుపాయం – యూపీఐ యాప్ల ద్వారా పీఎఫ్లో ఉన్న మొత్తాన్ని కూడా చూడొచ్చు.
.తక్షణ విత్డ్రా సదుపాయం – రూ. 1 లక్ష వరకు నేరుగా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకునే వెసులుబాటు.
.ఆటోమేటెడ్ క్లెయిమ్ ప్రాసెసింగ్ – పీఎఫ్ ఉపసంహరణ క్లెయిమ్లు 3 రోజుల్లో పూర్తవుతాయి.
.120 డేటాబేస్ల ఏకీకరణ – క్లెయిమ్ ప్రాసెసింగ్ను వేగవంతం చేసేందుకు EPFO ఇప్పటికే డిజిటలైజేషన్ ప్రాసెస్ను పూర్తి చేసింది.
.95 శాతం క్లెయిమ్లు ఆటోమేటెడ్ – EPFO క్లెయిమ్లను స్వయంచాలక (ఆటోమేటెడ్ ప్రాసెస్) విధానంలో నిర్వహిస్తోంది.
ఈపీఎఫ్ఓ డిజిటలైజేషన్ ప్రయోజనాలు..
.సులభమైన పీఎఫ్ ఉపసంహరణ – ఇకపై ఉద్యోగులు కనీస డాక్యుమెంటేషన్తోనే తమ నిధులను ఉపసంహరించుకోవచ్చు.
.అలర్ట్స్ అండ్ నోటిఫికేషన్స్ – EPFO యాప్ లేదా యూపీఐ యాప్ ద్వారా నేరుగా అప్డేట్స్ అందుబాటులో ఉంటాయి.
.పూర్తి పారదర్శకత – డిజిటల్ విధానం ద్వారా పీఎఫ్ ట్రాన్సాక్షన్లు సులభంగా ట్రాక్ చేసుకోవచ్చు.
.తక్కువ టైం, తక్కువ శ్రమ – ATM / UPI ద్వారా ఉపసంహరణ మరింత వేగంగా పూర్తవుతుంది.