हिन्दी | Epaper
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం

Pawan : పవన్ దెబ్బకు స్టాలిన్ పాలనకు ముగింపు – తమిళనాడు బిజెపి

Sudheer
Pawan : పవన్ దెబ్బకు స్టాలిన్ పాలనకు ముగింపు – తమిళనాడు బిజెపి

తమిళనాడు డీఎంకే మంత్రి శేఖర్ బాబు (Sekhar Babu) చేసిన వ్యాఖ్యలు రాజకీయ కలకలం రేపుతున్నాయి. పవన్ కల్యాణ్ (Pawan) చెన్నై నుంచి గెలవగలరా? అని ఆయన సంశయం వ్యక్తం చేయడం పట్ల తమిళనాడు బీజేపీ అధికార ప్రతినిధి ఏ.ఎన్.ఎస్. ప్రసాద్ తీవ్రంగా స్పందించారు. పవన్ కల్యాణ్ పోటీ చేయకపోయినా, కేవలం కొళత్తూరు నియోజకవర్గంలో ఆయన ప్రచారం చేస్తే చాలని, డీఎంకే అధికారానికి అదే ముగింపు కావచ్చని ప్రసాద్ వ్యాఖ్యానించారు. 2026లో సీఎం స్టాలిన్ తిరిగి గెలుస్తారా అన్నదానిపై శేఖర్ బాబు దృష్టి పెట్టాలంటూ ప్రసాద్ సవాల్ విసిరారు.

పవన్ కల్యాణ్ ప్రభావం, డీఎంకే క్షీణించే ప్రజాదరణ

2011లో స్టాలిన్ కొళత్తూరులో కేవలం 2,734 ఓట్ల తేడాతో మాత్రమే గెలిచారన్న విషయాన్ని గుర్తు చేస్తూ, ఇప్పుడు పరిస్థితి బీజేపీకు అనుకూలంగా మారిందన్నారు. డీఎంకే ప్రజాదరణ తగ్గుతుండటంతో శేఖర్ బాబు ఇలా స్పందించటం హాస్యాస్పదమన్నారు. ఎన్డీయే కూటమి నేతృత్వంలోని బీజేపీ కార్యకర్త కూడా 2026లో కొళత్తూరులో స్టాలిన్‌ను ఓడించగలడని ప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. నైనార్ నాగేంద్రన్ నాయకత్వంలో, అమిత్ షా వ్యూహాత్మక సమన్వయంతో బీజేపీ తమిళనాడులో పునాదులు బలంగా వేసుకుంటోందని ఆయన తెలిపారు.

పవన్ కల్యాణ్‌కు తమిళనాడుతో అనుబంధం, డీఎంకేపై విరుచుకుపడిన ప్రసాద్

పవన్ కల్యాణ్ తెలుగువారు అయినా, చెన్నైలోనే పెరిగారని, తమిళ భాషపై ఆయనకు అవగాహన ఉందని ప్రసాద్ గుర్తుచేశారు. మదురైలో జరిగిన మురుగన్ భక్త సభలో పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగం భక్తులను ఆకట్టుకుందని తెలిపారు. డీఎంకే ప్రభుత్వం హిందువుల మనోభావాలను కించపరుస్తూ, ధర్మాదాయ శాఖ ద్వారా ఆలయ నిధులను దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. మదురై సభ ద్వారా లక్షలాది భక్తులు కంద షష్ఠి కవచం పఠిస్తూ, ఆధ్యాత్మిక ప్రతిస్పందనను అందించారని ప్రసాద్ పేర్కొన్నారు.

Read Also : Oman :ఒమన్ లో ధనవంతులకు 5 శాతం ఇన్ కమ్ ట్యాక్స్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870