Pawan Kalyan రాయలసీమ రతనాలసీమ కావాలని ఆకాంక్ష పవన్

Pawan Kalyan : రాయలసీమ రతనాలసీమ కావాలని ఆకాంక్ష : పవన్

Pawan Kalyan:రాయలసీమ రతనాలసీమ కావాలని ఆకాంక్ష : పవన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కష్టకాలంలో ఉన్న సమయంలో కూటమికి గట్టి మద్దతుగా నిలిచి ఘన విజయాన్ని అందించారని నేతలు ప్రకటించారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 164 సీట్లు గెలుచుకుని కూటమి అఖండ విజయం సాధించిందని వెల్లడించారు. అలాగే 21 ఎంపీ స్థానాలను కూడా కూటమికి కట్టబెట్టిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించేందుకు కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు.ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు చేసిన సేవలను కొనియాడుతూ ఆయనే తనకు స్ఫూర్తి అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి ఎంతో అవసరమని ఆయన పదిహేను సంవత్సరాలపాటు ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరుకుంటున్నానని వెల్లడించారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పూడిచెర్ల గ్రామంలోని రైతు రాజన్న పొలంలో ఏర్పాటు చేసిన ఫామ్ పాండ్ నిర్మాణ పనులకు పవన్ భూమిపూజ నిర్వహించారు.

Advertisements
Pawan Kalyan రాయలసీమ రతనాలసీమ కావాలని ఆకాంక్ష పవన్
Pawan Kalyan రాయలసీమ రతనాలసీమ కావాలని ఆకాంక్ష పవన్

అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు.రాష్ట్రంలో పల్లె పండుగ విజయవంతంగా సాగడానికి చంద్రబాబు కృషి ఎంతో ఉందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. రాయలసీమ ప్రాంతంలో నీటి సమస్య తీవ్రమై ఉండేదని, భారీ వర్షాలు కురిసినప్పటికీ నీటి నిల్వలు లేకపోవడంతో వినియోగం జరగడం లేదని అన్నారు. మే నెలలోగా లక్షా 55 వేల నీటి కుంటలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, వర్షాకాలంలో ఇవన్నీ నిండితే రాష్ట్రానికి ఒక టీఎంసీ నీరు అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. శ్రీకృష్ణదేవరాయలు ఆకాంక్షించినట్లుగా రాయలసీమను రతనాలసీమగా మార్చే దిశగా కృషి చేస్తున్నామని చెప్పారు.

రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నదే తన ఉద్దేశమని, అందుకోసం తనకు అప్పగించిన శాఖలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నానని తెలిపారు. ఒకేరోజు 13,326 గ్రామసభలను నిర్వహించి అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన ద్వారా ప్రపంచ రికార్డు నెలకొల్పామన్నారు. రాష్ట్రంలోని 52.92 లక్షల కుటుంబాలకు చెందిన 97.44 లక్షల మంది ఉపాధి కూలీలకు స్వగ్రామాల్లోనే ఉపాధి కల్పించామని తెలిపారు.వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల కాలంలో కేవలం 4,000 కి.మీ రోడ్లు మాత్రమే నిర్మించారని, కానీ ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే దాదాపు 4,000 కి.మీ రోడ్లను నిర్మించామని పవన్ కల్యాణ్ వివరించారు. 100 మందికి పైగా జనాభా ఉన్న గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించామని, అలాగే విద్యుత్, తాగునీటి సౌకర్యాలు అందజేసినట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికి సమాన అభివృద్ధి తేవడమే తమ లక్ష్యమని పవన్ స్పష్టం చేశారు.

Related Posts
స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర ర్యాంకులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
AP govt

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లాల ర్యాంకులను ప్రకటించింది. మొత్తం 14 సూచికలు ఆధారంగా ఈ ర్యాంకులను కేటాయించారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, పబ్లిక్ టాయిలెట్స్, Read more

Affidavit: వివేకా హత్య కేసు..సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్
వివేకా హత్య కేసు..సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్

Affidavit : ఏపీలో కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ఇవాళ గట్టి ఎదురు దెబ్బ తగిలింది. గతంలో తన బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య Read more

పీఎంజే జ్యూవెల్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా సితార
Sitara Ghattamaneni PMJ Jew

పీఎంజే జ్యూవెల్స్ మరో సరికొత్త క్యాంపెయిన్‌ను ఆవిష్కరించింది. పీఎంజే జ్యూవెల్స్ కు సూపర్ స్టార్ మహేశ్ బాబు గారాల పట్టి ఘట్టమనేని సితార బ్రాండ్ అంబాసిడర్ గా Read more

ముఖ్యమంత్రి చంద్రబాబుతో వేమిరెడ్డి దంపతులు భేటి
ముఖ్యమంత్రి చంద్రబాబుతో వేమిరెడ్డి దంపతులు భేటి

అమరావతి: సీఎం చంద్రబాబును నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కలిశారు. ఈ మేరకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన వేమిరెడ్డి Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×