హిందూ ధర్మంపై మాట్లాడే హక్కు పవన్‌కు లేదు: జగన్

YS Jagan : హిందూ ధర్మంపై మాట్లాడే హక్కు పవన్‌కు లేదు: జగన్

YS Jagan: హిందూ ధర్మం, ఆలయాల పరిరక్షణపై మాట్లాడే హక్కు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు లేదని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. కశీనాయన క్షేత్రాన్ని కూల్చేస్తుంటే పవన్‌ ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఎక్స్‌లో మండిపడ్డారు. ఆలయాల పట్ల తమకు ఉన్న చిత్తశుద్ధి కూటమి ప్రభుత్వానికి లేదన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కాశీనాయన ఆలయాన్ని కూటమి ప్రభుత్వం కూలుస్తోంది. ఆ ఆలయ అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

Advertisements
 హిందూ ధర్మంపై మాట్లాడే హక్కు పవన్‌కు లేదు: జగన్

ఆధ్యాత్మిక శోభ విలసిల్లింది? ఎవరి హయాంలో

దేవుడు అంటే భక్తి, భయం ఉన్నది ఎవరికి? ఎవరి హయాంలో ఆధ్యాత్మిక శోభ విలసిల్లింది? ఎవరి హయాంలో హైందవ ధర్మాన్ని పరిరక్షించారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రసిద్ధ కాశినాయన క్షేత్రంలో కూల్చివేతలు, రాష్ట్రంలో ఆలయాలపైన, హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులకు ప్రత్యక్ష సాక్ష్యాలు కావా?” కూటమి ప్రభుత్వాన్ని వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు. ”అటవీ ప్రాంతంలో ఉన్న కాశీనాయన క్షేత్రంలో నిర్మాణాల నిలిపివేత, వాటి తొలగింపుపై ఆగస్టు7, 2023న కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ ఆదేశాలు ఇచ్చినా, ఆ క్షేత్ర పరిరక్షణకు మా ప్రభుత్వం నడుంబిగించిన మాట వాస్తవం కాదా?

మా పాలనలో కాశినాయన క్షేత్రానికి వ్యతిరేకంగా ఒక్క చర్య తీసుకోలేదు

అదే నెల ఆగస్టు 18, 2023న అప్పటి కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ కి ముఖ్యమంత్రి హోదాలో నేనే స్వయంగా లేఖరాసి కాశినాయన క్షేత్రం ఉన్న 12.98 హెక్టార్ల భూమిని అటవీశాఖ నుంచి మినహాయించాలని, ఆ క్షేత్రానికి రిజర్వ్‌ చేయాలని, దీనికోసం ఎలాంటి పరిహారం కోరినా, ఎలాంటి ఆంక్షలను విధించినా తు.చ.తప్పక పాటిస్తామని లేఖలో చాలా స్పష్టంగా చెప్పాం. మా ప్రయత్నాలతో కేంద్రం తన చర్యలను నిలుపుదల చేసింది. మా ఐదేళ్ల పాలనలో కాశినాయన క్షేత్రానికి వ్యతిరేకంగా ఎవ్వరూ ఒక్క చర్యకూడా తీసుకోలేదు.

Related Posts
Revanth Reddy: జానారెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
Revanth Reddy: జానారెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

తెలంగాణలో మావోయిస్టులతో శాంతి చర్చలను పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ ప్రక్రియలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు. శాంతి చర్చలను Read more

మహిళా దినోత్సవం సందర్బంగా ఈ జిల్లాల్లో సెలవు

ఆంధ్రప్రదేశ్‌లో మహిళా దినోత్సవం సందర్భంగా కొన్ని జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ప్రకాశం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఈ రోజు (మార్చి 8) సెలవుగా Read more

ఏపీ బడ్జెట్ దేనికెంత కేటాయింపు
బడ్జెట్లో భారీగా రాజధాని అమరావతికి కేటాయింపులు

ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి  బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.రూ. 3.22 లక్షల కోట్లతో బడ్జెట్ ను తీసుకొచ్చారు.రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల Read more

Manchireddy : మ‌ల్‌రెడ్డికి మంచిరెడ్డి కిష‌న్ రెడ్డి స‌వాల్
manchireddy kishan reddy

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అభివృద్ధిని పక్కనపెట్టి మంత్రి పదవికే మొగ్గుచూపుతున్న మల్‌రెడ్డి రంగారెడ్డి పై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×