Pawan Kalyan మరో 15 ఏళ్లు చంద్రబాబే సీఎం పవన్ కల్యాణ్

Pawan Kalyan: మరో 15 ఏళ్లు చంద్రబాబే సీఎం : పవన్ కల్యాణ్

Pawan Kalyan: మరో 15 ఏళ్లు చంద్రబాబే సీఎం : పవన్ కల్యాణ్ రాష్ట్రానికి మరో 15 ఏళ్లు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన శాసనసభ్యుల క్రీడా పోటీల ముగింపు వేడుకలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు ప్రదర్శించిన క్రీడా స్ఫూర్తిని ప్రశంసిస్తూ, విజేతలకు అభినందనలు తెలిపారు.ఈ వేడుకలో మోషన్ రాజు, రఘురామకృష్ణ రాజులతో పాటు కమిటీ సభ్యులు, క్రీడా శాఖాధికారులు హాజరయ్యారు. ఎమ్మెల్యేలు క్రికెట్, టెన్నిస్, షటిల్, వాలీబాల్, కబడ్డీ, అథ్లెటిక్స్, టగ్ ఆఫ్ వార్ వంటి విభిన్న క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటారు.

Pawan Kalyan మరో 15 ఏళ్లు చంద్రబాబే సీఎం పవన్ కల్యాణ్
Pawan Kalyan మరో 15 ఏళ్లు చంద్రబాబే సీఎం పవన్ కల్యాణ్

విజేతలందరికీ పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు.సభలో ప్రసంగించిన ఆయన, రాజకీయాలకు అతీతంగా, సీనియర్-జూనియర్ అనే తేడా లేకుండా అందరూ ఐక్యంగా ఉండడం సంతోషంగా ఉందన్నారు.రాష్ట్ర క్రీడా సాధికార సంస్థ చేసిన కృషిని ప్రశంసిస్తూ, క్రీడా మైదానాల నిర్వహణ, ఆటగాళ్లకు అందించిన సౌకర్యాలను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు నాయకత్వం కీలకమని పవన్ కళ్యాణ్ అన్నారు. గత అనుభవాలను ఉపయోగించుకుని, రాష్ట్రాన్ని మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లేందుకు ఆయన అహర్నిశలు కృషి చేయాలని కోరారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు కనీసం 15 ఏళ్లు చంద్రబాబు నాయుడు అధికారంలో కొనసాగాలని ఆకాంక్షించారు. చంద్రబాబును పక్కన పెట్టే ప్రసక్తే లేదని, ఆయనతో కలిసి పనిచేయడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమాన్ని ఎప్పటికీ మర్చిపోలేని అనుభవంగా తీసుకోవాలని సూచిస్తూ ఈ వేడుకలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Related Posts
కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతాం- ఎమ్మెల్సీ కవిత
kavitha demand

లక్కినేని సుధీర్‌ను పరామర్శించిన కవిత తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ నేతలు నిరంతరం పోరాటం చేస్తున్నట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. బీఆర్ఎస్ నేతలపై కేసులు పెట్టి, Read more

నటుడు సోనూ సూద్ కు సంకల్ప్ కిరణ్ పురస్కారం
Sankalp Kiron award to actor Sonu Sood

హైదరాబాద్‌: సుచిరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంకల్ప్ దివాస్ కార్యక్రమం ఘనంగా జరిగింది. గురువారం సాయంత్రం నాంపల్లిలోని లలిత కళా తోరణం లో జరిగిన ఈ కార్యక్రమంలో Read more

కాకినాడ పోర్టును స్మ‌గ్లింగ్ డెన్ గా మార్చేశారు – మంత్రి నాదెండ్ల మనోహర్
kakindaport manohar

విశాఖపట్నం : ఇప్ప‌టికే 1,066 కేసులు పెట్టామ‌ని, 729 మందిని అరెస్టు చేశామని, 102 వాహ‌నాల‌ను సీజ్ చేశామ‌ని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్ల‌డించారు. ఆదేశించారు. రూ.240 Read more

డ్రైవరున్ను చెప్పుతో కొట్టిన మాజీ సీఎం కూతురు ఎందుకంటే !
Former CM's daughter hits d

అస్సాం మాజీ ముఖ్యమంత్రి ప్రఫుల్లా కుమార్ మహంత కూతురు ప్రజోయిత మహంత ఓ సంఘటన తో వార్తల్లో నిలిచారు. ఆమె తన వ్యక్తిగత డ్రైవర్‌ను చెప్పుతో కొట్టిన Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *