Pawan announced a donation

తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్‌కి రూ.50 లక్షల విరాళం ప్రకటించిన పవన్

  • తలసేమియా బాధితుల కోసం పవన్ సాయం

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్‌కి రూ.50 లక్షల విరాళాన్ని ప్రకటించారు. విజయవాడలో జరిగిన ‘యుఫోరియా మ్యూజికల్ నైట్’ కార్యక్రమంలో ఆయన ఈ విరాళాన్ని అందజేశారు. ఈ నిధులు తలసేమియా బాధిత చిన్నారుల చికిత్స కోసం ఉపయోగించనున్నారు. పవన్ కళ్యాణ్ సామాజిక సేవకు కట్టుబడి ఉన్నట్లు ఈ చర్య మరోసారి నిరూపించింది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, బాలకృష్ణ, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisements
Euphoria Musical Nigh2

ఇదిలా ఉంటె.. పవన్ కళ్యాణ్, చంద్రబాబు మధ్య దూరం పెరిగిందని, పవన్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అలిగారని ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. ముఖ్యంగా, ఇటీవల జరిగిన క్యాబినెట్ మీటింగ్‌కి పవన్ హాజరుకాకపోవడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. అయితే, విజయవాడలో జరిగిన తమన్ మ్యూజికల్ నైట్‌లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు సరదాగా మాట్లాడుకుంటూ కనిపించడంతో ఈ రూమర్లకు చెక్ పడినట్టైంది.

గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ టీడీపీ వైఖరిపై అసంతృప్తిగా ఉన్నారంటూ సోషల్ మీడియాలో అనేక వార్తలు వైరల్ అయ్యాయి. మరింతగా, తన అనారోగ్యం కారణంగా అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉన్నారనే జనసేన వెర్షన్ కూడా వినిపించింది. జనసేన పార్టీ కార్యక్రమాలను నాగబాబు ద్వారా నిర్వహించడమే కాకుండా, క్యాబినెట్ సమావేశానికి కూడా హాజరుకాకపోవడంతో చంద్రబాబు స్వయంగా జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్‌ను పవన్ గైర్హాజరుకు గల కారణాలను అడిగి తెలుసుకున్నట్లు వార్తలు వచ్చాయి.

మ్యూజికల్ నైట్‌లో పవన్ – చంద్రబాబు చట్టాపట్టాలు

ఈ అనుమానాలకు తెరదించుతూ విజయవాడలో జరిగిన ‘యుఫోరియా’ మ్యూజికల్ నైట్‌లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు పక్కపక్కనే కూర్చొని సరదాగా మాట్లాడుకోవడం విశేషం. ఈ కార్యక్రమానికి నారా భువనేశ్వరి పవన్ కళ్యాణ్‌ను స్వాగతం పలికారు. అంతేకాకుండా, బాలకృష్ణ, నారా లోకేష్ కూడా పవన్, చంద్రబాబు వెంటనే కూర్చుని మాట్లాడుకుంటూ కనిపించడం జనసేన – టీడీపీ అనుచరులకు మాంచి ఊరటనిచ్చింది.

Related Posts
ఈ జన్మలో రాజకీయాల జోలికి వెళ్ళను – చిరంజీవి
Chiranjeevi political

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు శాశ్వతంగా గుడ్‌బై.మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు శాశ్వతంగా గుడ్‌బై చెప్పినట్లు స్పష్టం చేశారు. ‘బ్రహ్మా ఆనందం’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన ఆయన, ఇకపై తాను Read more

సత్యవర్ధన్ ను వల్లభనేని వంశీ బెదిరించారు: విజయవాడ సీపీ
సత్యవర్ధన్ ను వల్లభనేని వంశీ బెదిరించారు: విజయవాడ సీపీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ వ్యవహారం రాజకీయ వర్గాలలోను, ప్రజలలోను చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా Read more

స్వ‌చ్ఛ‌త కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ప్రధాని మోడీ
Prime Minister Modi participated in the cleanliness drive

Prime Minister Modi participated in the cleanliness drive న్యూఢిల్లీ: ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఇవాళ స్వ‌చ్ఛ‌త కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. చీపురు ప‌ట్టి ఆయ‌న చెత్త‌ను Read more

పోసాని కృష్ణమురళి కేసుపై కీలక పరిణామాలు
పోసాని కృష్ణమురళి కేసుపై కీలక పరిణామాలు

టాలీవుడ్ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలు లైంగిక వేధింపుల కిందకే వస్తాయని కోర్టు పేర్కొంది. ఈ కేసులో రిమాండ్ విధించిన కోర్టు, ఆయనను రాజంపేట Read more

×