OTT :18 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన పార్లమెంటరీ ప్యానెల్

OTT :18 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన పార్లమెంటరీ ప్యానెల్

ఇటీవల ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో అశ్లీల కంటెంట్‌ను ఇతర సోషల్ మీడియా ఛానళ్లలో షేర్ చేయడాన్ని నిరోధించేందుకు పార్లమెంటరీ కమిటీ కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ సమస్యను అధిగమించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహాయాన్ని వినియోగించాలి అని సూచించింది. పునరావృతంగా నేరాలకు పాల్పడుతున్నవారిపై కఠిన శిక్షలు విధించేందుకు ప్రస్తుత చట్టాలు సరిపోవని, అందుకే తాజా సాంకేతికతలకు అనుగుణంగా కొత్త చట్టాలు అవసరం అని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అభిప్రాయపడింది.

Advertisements

అశ్లీల కంటెంట్‌పై చర్యలు

బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే నేతృత్వంలోని కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఈ అంశంపై మోడీ ప్రభుత్వానికి నివేదిక అందించింది.గతంలోనూ అశ్లీల కంటెంట్ కలిగి ఉన్న 18 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లను, 19 వెబ్‌సైట్‌లను, 10 మొబైల్ యాప్‌లను బ్లాక్ చేసినట్లు కమిటీ పేర్కొంది. అయితే టెలిగ్రామ్ ఛానళ్ల వంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఈ కంటెంట్ సులభంగా లభిస్తుండటంతో, దీనికి వ్యతిరేకంగా ఐటీ మంత్రిత్వ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించింది.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం

ఐటి చట్టం 2021లోని పార్ట్ త్రీ,ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల గురించి వివరిస్తుంది. ‘ఏ’ రేటింగ్ ఉన్న కంటెంట్‌ను పిల్లలు యాక్సెస్‌ చేయకుండా ఇది నిరోధిస్తోంది. అయితే 18 ఓటీటీలు, 19 వెబ్‌సైట్‌లు, 10 యాప్‌లలో బ్లాక్ చేసిన కంటెంట్‌లు టెలిగ్రామ్ ఛానల్ వంటి ఇతర మీడియా ప్లాట్‌ఫామ్‌లలో సులభంగా అందుబాటు ఉంటోందని, దీన్ని ఎదుర్కోవడానికి ఒక ప్రణాళికను అందించాలని ప్యానెల్ మంత్రిత్వ శాఖను కోరింది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రస్తుతం చట్టాలు సరిపోతాయా,తాజా సాంకేతికతల నేపథ్యంలో మరింత కఠినమైన చట్టాలు అవసరమా, అనిప్రశ్నించింది.

1725007848 5866

ప్రభుత్వ చర్యలు

అశ్లీల కంటెంట్ వ్యాప్తి చెందకుండా నియంత్రించేందుకు ప్రభుత్వ చర్యలు తీసుకున్నా, కొన్ని ఓటీటీప్లాట్‌ఫారమ్‌లు ప్రోగ్రామ్‌ల పేర్లను మార్చడం, కొత్త ఐపి అడ్రస్‌లను ఉపయోగించడం ద్వారా నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయి. ఈ సమస్యను గుర్తించేందుకు,నివారించేందుకు ఏఐ ఆధారిత టెక్నాలజీని వినియోగించాలి అని కమిటీ సూచించింది.

సినిమాటోగ్రఫీ చట్టం

అడల్ట్ కంటెంట్‌ను ప్రసారం చేసే డిజిటల్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ఛానళ్లపై సినిమాటోగ్రఫీ చట్టం 2023 ప్రకారం ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకున్నారు. అయితే మరింత కఠిన చర్యలు తీసుకోవడం, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లను కఠినంగా నియంత్రించడం అవసరం అని పార్లమెంటరీ కమిటీ అభిప్రాయపడింది.

Related Posts
ప్రయాణికులకు శుభవార్త.. డబ్బులు చెల్లించకుండా రైలు టిక్కెట్
indian railways

దేశంలో భారతీయ రైల్వే సంస్థ కోట్ల మంది ప్రయాణికులను రోజూ వారి గమ్యస్థానాలకు చేర్చుతోంది. దశాబ్ధాలుగా తక్కువ ఖర్చులో దూర ప్రయాణాలు చేసేందుకు ఈ ప్రభుత్వ సంస్థ Read more

రాహుల్ గాంధీ ఆరోపణల పై స్పందించిన ఈసీ
EC responded to Rahul Gandh

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపణలు చేసిన తెలిసిందే. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ Read more

కేంద్ర మంత్రి కుమార్తెకు తప్పని లైంగిక వేధింపులు
కేంద్ర మంత్రి కుమార్తెకు తప్పని లైంగిక వేధింపులు

మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లా లో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. కేంద్ర మంత్రి కుమార్తెపై కొందరు యువకులు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా Read more

Trump Tariffs: ట్రంప్ టారిఫ్ ల ద్వారా అమెరికాకు భారీ ఆదాయం
ట్రంప్ టారిఫ్ ల ద్వారా అమెరికాకు ఆదాయం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల అమెరికాకు వచ్చే ఆదాయం గురించి కీలకమైన వివరాలు వెల్లడించారు. ఆయన ప్రకటించిన ప్రకారం, తాజా టారిఫ్ ల వల్ల అమెరికా Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×