పరిటాల హత్యపై సునిత జగన్ పై సంచలన ఆరోపణలు

Paritala Sunitha: పరిటాల హత్యపై సునిత జగన్ పై సంచలన ఆరోపణలు

రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తాజాగా మీడియా సమావేశంలో సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త పరిటాల రవి హత్యలో వైఎస్ జగన్ పాత్ర ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ హత్య కేసులో సీబీఐ కూడా జగన్‌ను విచారించిందని గుర్తుచేశారు. తన భర్త హత్యకు సంబంధించి రాజకీయ కుట్రలను వెలుగులోకి తేవాల్సిన అవసరం ఉందని అన్నారు. తాజాగా రాష్ట్ర రాజకీయాలు మళ్లీ ఫ్యాక్షన్ రాజకీయాలవైపు మళ్లుతున్నాయని, గతంలో తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నట్లు ఇప్పుడు మళ్లీ ఆయా వర్గాలు రెచ్చిపోతున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా తోపుదుర్తి సోదరుల ముఠా అనుసరిస్తున్న విధానంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisements

జగన్ పై ఆరోపణలు

ఇవాళ టీవీ బాంబు గురించి మాట్లాడుతున్న వారు కారు బాంబు గురించి కూడా మాట్లాడాలి అని పరిటాల సునీత పేర్కొన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 45 మందిని హత్య చేశారని ఆరోపించారు. ఈ హత్యలకు పాల్పడింది ఎవరు? బాధ్యులను ఎందుకు ప్రశ్నించరు? అని ఆమె నిలదీశారు. సునీత తోపుదుర్తి సోదరుల కుట్రలను తీవ్రంగా తప్పుబట్టారు. వారు ఓబుల్ రెడ్డి, మద్దెలచెరువు సూరి కుటుంబాలను మళ్లీ ఫ్యాక్షనిజంలోకి లాగేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తోపుదుర్తి సోదరుల మాటలు నమ్మి ఈ కుట్రలో భాగస్వామ్యం కావొద్దని కనుముక్కల ఉమ, గంగుల భానుమతికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటికే మన మూడు కుటుంబాలు ఫ్యాక్షన్ కారణంగా చాలా నష్టపోయాయి. మనం కోలుకోవడానికి చాలా సమయం పట్టింది ఇప్పుడు మళ్లీ తోపుదుర్తి సోదరులు ఫ్యాక్షన్ ఉచ్చులోకి లాగడానికి ప్రయత్నిస్తున్నారు. అని ఆమె తెలిపారు.

జగన్ పాపిరెడ్డిపల్లి పర్యటనపై కౌంటర్

“తోపుదుర్తి సోదరులు ఏం చెప్పినా జగన్ నమ్మేస్తున్నారు ఐదేళ్లు సీఎంగా పనిచేసిన మీరు నిజానిజాలు తెలుసుకోరా?” అని ఆమె ప్రశ్నించారు. జగన్ శుక్రవారం పాపిరెడ్డిపల్లి గ్రామానికి వస్తానంటున్నారు ఆయనకు శుక్రవారం కలిసొచ్చిందేమో! జగన్ వస్తున్నప్పుడు తన సూట్ కేసులో కాస్త దుస్తులు ఎక్కువగా తెచ్చుకుంటే బాగుంటుంది లింగమయ్య కుటుంబాన్నే కాదు, మీ పార్టీ వల్ల నష్టపోయిన వారి కుటుంబాలను కూడా పరామర్శించాలి కదా!” అంటూ పరిటాల సునీత ఘాటువాక్యాలు చేశారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మళ్లీ ఫ్యాక్షన్ రాజకీయం ముదిరిపోతోందని పరిటాల సునీత ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో ఫ్యాక్షన్ చిచ్చు పెట్టవద్దని జగన్‌కు స్పష్టం చేస్తున్నా. రాప్తాడులో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే గతం గుర్తుకు వస్తోంది. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టడం సరికాదు అని ఆమె వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌లో కనీస అభివృద్ధి కంటే రాజకీయ కుట్రలకే ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం ఉందని ఆమె ఆరోపించారు. తాను ప్రజాసేవకు కట్టుబడి ఉన్నానని, అయితే ప్రభుత్వం మాత్రం విభజన, కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని చెప్పారు. పరిటాల సునీత చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గతంలో జరిగిన పరిటాల రవి హత్య కేసు, వైఎస్ కుటుంబంతో జరిగిన విభేదాలు, ఫ్యాక్షన్ రాజకీయాలపై ఆమె మళ్లీ తెరపైకి తెచ్చారు.

Related Posts
ఇలాంటి అవినీతి ప్రభుత్వాన్ని చూడలేదు – ఈటల
Etela hydra

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక శాఖలో లంచం తీసుకోకుండా పనులు జరుగడం లేదని ఆయన ఆరోపించారు. ఇళ్ల దగ్గరే Read more

తెలంగాణ శాసనసభలో మన్మోహన్ సింగ్ స్మారక సమావేశం
తెలంగాణ శాసనసభలో మన్మోహన్ సింగ్ స్మారక సమావేశం

తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశం డిసెంబర్ 30, 2024, సోమవారం నాడు నిర్వహించనున్నారు. శాసనసభ సచివాలయం ఈ విషయాన్ని శనివారం ప్రకటించింది. ఉదయం 10 గంటలకు ప్రారంభం Read more

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
tirumala vaikunta ekadasi 2

తిరుమలలో భక్తుల రద్దీ రోజు రోజుకు పెరుగుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రస్తుతం స్వామివారి దర్శనానికి భక్తులు సుమారు 18 Read more

పోసాని కృష్ణమురళికి బెయిల్‌
పోసాని కృష్ణమురళికి బెయిల్‌

హైదరాబాద్‌: ప్రముఖ నటుడు,రచయిత పోసాని కృష్ణమురళికి బెయిల్‌ మంజూరైంది. ఓబులవారిపల్లి పీఎస్‌లో పోసాని కృష్ణమురళిపై నమోదైన కేసులో బెయిల్ లభించింది. కడప మొబైల్ కోర్టు పోసానికి బెయిల్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×