2019లో భారత్-పాకిస్థాన్ (Ind-Pakistan ) మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన సమయంలో, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ (Wing Commander Abhinandan Vardhaman ) పాకిస్తాన్ సైన్యం చేతికి పట్టుబడిన సంగతి తెలిసిందే. ఆయనను అరెస్ట్ చేసిన పాక్ ఆర్మీ అధికారి మోయిజ్ అబ్బాస్ షా (Pakistan Army Major Moiz Abbas Shah) గన్ఫైట్లో హతమయ్యాడు. ఆ కాలంలో అభినందన్ భారతీయ హీరోగా వెలుగొందినప్పటికీ, మోయిజ్ అబ్బాస్ పాక్ సైన్యంలో ప్రత్యేక గుర్తింపు పొందాడు.
TTPతో ఎదురుకాల్పుల్లో మృతిచెందిన మోయిజ్
తాజాగా పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో తెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్ (TTP) తీవ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో మేజర్ మోయిజ్ (37) మృతి చెందాడు. ప్రభుత్వ అధికారిక ప్రకటనల ప్రకారం, పాక్ ఆర్మీ బలగాలు నిర్వహించిన ఆపరేషన్లో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన పాక్ సైన్యంలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. దేశ భద్రత కోసం మోయిజ్ చేసిన సేవలను అక్కడి ప్రభుత్వం ప్రశంసించింది.
అభినందన్కి మోయిజ్ సంబంధం – చరిత్రలో ఒక పేజీ
పుల్వామా దాడికి ప్రతిగా భారత్ బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ జరిపిన సందర్భంలో, వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ వాహనించిన మిగ్-21 విమానం పాక్ వాయుసేనతో డాగ్ఫైట్లో కూలిపోవడంతో ఆయన పాక్ చేతికి చిక్కారు. అప్పట్లో అభినందన్ను మోయిజ్ అబ్బాస్ షా అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకున్న అధికారి కావడం విశేషం. అయితే పాక్ ఆర్మీ ఈ విషయాన్ని అప్పట్లో వెల్లడించకపోయినా, ఇప్పుడు మోయిజ్ మృతి నేపథ్యంలో ఆ విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటి ఘర్షణలో దేశసేవకుడిగా నిలిచిన అభినందన్, భారతదేశంలో జాతీయ హీరోగా గుర్తింపు పొందారు.
Read Also : Amit Shah: ఎమర్జెన్సీపై అమిత్ షా ఘాటు వ్యాఖ్యలు