हिन्दी | Epaper

India – Pakistan War : మరోసారి పాక్ డ్రోన్ అటాక్

Sudheer
India – Pakistan War : మరోసారి పాక్ డ్రోన్ అటాక్

భారత సరిహద్దుల్లో పరిస్థితులు క్షణక్షణానికి ఉద్రిక్తంగా మారుతున్నాయి. తాజాగా పాకిస్థాన్ మళ్లీ మరోసారి దుర్మార్గానికి పాల్పడింది. ఇప్పటికే భారత భూభాగంలోని 26 ప్రాంతాల్లో డ్రోన్ దాడులు చేసిన పాక్, తెల్లవారుజామున జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్‌లలోని పలు ప్రాంతాలపై మళ్లీ డ్రోన్లతో దాడికి యత్నించింది. ఈసారి అవి సాయుధ డ్రోన్లు కావడం ఆందోళనకరం.

దాడి లక్ష్యంగా ఉన్న ప్రాంతాల్లో ముందస్తుగా బ్లాక్ అవుట్

ఈ యత్నాన్ని ముందుగానే గుర్తించిన భారత రక్షణ సిబ్బంది అప్రమత్తమయ్యారు. దాడి లక్ష్యంగా ఉన్న ప్రాంతాల్లో ముందస్తుగా బ్లాక్ అవుట్ ప్రకటించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, వాహనాల కదలికలను నిలిపేశారు. రాడార్ మరియు నైట్ విజన్ సిస్టంల సహాయంతో పాక్ డ్రోన్ల చలనం గుర్తించి, వాటిని గాల్లోనే ధ్వంసం చేయడంలో భారత ఆర్మీ విజయం సాధించింది.

పాక్ వరుస డ్రోన్ దాడులు

పాక్ వరుస డ్రోన్ దాడులతో సరిహద్దు రాష్ట్రాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. భారత భద్రతా బలగాలు అన్ని రంగాల్లో అప్రమత్తంగా ఉండి, మరింత కఠిన చర్యలు చేపడుతున్నాయి. ఇటువంటి దాడుల పట్ల భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తుండగా, పౌరులకు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. పాక్ ఈ తీరుతో ముందుకు సాగితే తీవ్ర పరిణామాలకు సిద్ధంగా ఉండాలసి ఉంటుందని కేంద్రం హెచ్చరించింది.

Read Also : Airports : దేశంలో 32 ఎయిర్పోర్టులు మూసివేత

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870