balakrishna padmabhushan2

బాలయ్యకు పద్మభూషణ్..చంద్రబాబు , ఎన్టీఆర్ అభినందనలు

నందమూరి బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం ప్రకటించింది. కథానాయకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు చేసిన సేవకు గాను, అదేవిధంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఎంతో మందికి చికిత్స అందిస్తున్నందుకు గాను, అదే విధంగా ఏపీలోని హిందూపూర్ శాసన సభ్యుడిగా మంచి పనులు చేస్తున్నందుకు గాను ఆయనను పద్మ భూషణ్ పురస్కారంతో సత్కరించింది. హీరోగా ఆయన కెరీర్ చూస్తే బ్లాక్ బస్టర్ విజయాలు ఎన్నో ఉన్నాయి. ఆయన టచ్ చేయనటువంటి జోనర్ కూడా లేదు. అయితే… ఇప్పటివరకు బాలకృష్ణకు పద్మ పురస్కారం రాలేదు.

Advertisements

నందమూరి అభిమానులతో పాటు తెలుగు ప్రజలు ప్రేక్షకులలో బాలకృష్ణకు పద్మశ్రీ పురస్కారం రాలేదనే లోటు ఉండేది. ఇవాల్టితో ఆ లోటు తీరిపోయింది. పద్మశ్రీ కాకుండా నేరుగా పద్మభూషణ్ పురస్కారంతో బాలకృష్ణను కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ బావ, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. పద్మభూషణ్ అవార్డుకు ఎంపికైనందుకు బాలకృష్ణకు అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా చంద్రబాబు ట్వీట్ చేశారు.

balakrishna padmabhushan

“తెలుగు సినీ దిగ్గజం, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ పురస్కారం పొందినందుకు హృదయపూర్వక అభినందనలు. లెజెండరీ ఎన్టీఆర్ గారి వారసత్వాన్ని నిలబెడుతూ, మీరు సినిమా, రాజకీయాలు, దాతృత్వంలో ముందున్నారు. ప్రజా సంక్షేమానికి ప్రత్యేకించి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా మీ అంకితభావం లెక్కలేనన్ని జీవితాలను నిలబెట్టింది. లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చింది. ఇది నిజమైన ఐకాన్‌కు దయగల నాయకుడికి తగిన గౌరవం” అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

అలాగే జూనియర్ ఎన్టీఆర్ సైతం బాలకృష్ణ కు అభినందనలు తెలియజేసారు.‘పద్మ భూషణ్ పురస్కారం లభించినందుకు కంగ్రాట్స్ బాలా బాబాయ్. సినీ పరిశ్రమకు, ప్రజా సేవకు మీరు చేసిన అసమానమైన సేవలకు నిదర్శనంగా ఈ గుర్తింపు దక్కింది’ అని తారక్ కొనియాడారు.

Related Posts
మిర్చి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్
Center is good news for chilli farmers

కనీస ధర రూ. 11,781కి కొనుగోలు చేయాలని నిర్ణయం న్యూఢిల్లీ: ఏపీలో మర్చిధరలు పడిపోవడంతో రైతుల్ని ఆదుకోవడానికి కేంద్రాన్ని చంద్రబాబు రంగంలోకి దించారు. మార్కెట్ ఇంటర్‌వెన్షన్ స్కీమ్ Read more

రాహుల్ గాంధీపై కోర్టు రూ.200 జరిమానా
రాహుల్ గాంధీపై కోర్టు రూ.200 జరిమానా

రాహుల్ గాంధీపై కోర్టు రూ.200 జరిమానా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి ఉత్తరప్రదేశ్‌లోని ఒక న్యాయస్థానం రూ.200 జరిమానా విధించింది. ఈ నిర్ణయం రాహుల్ గాంధీ Read more

ఖాకీ దుస్తుల్లో అసెంబ్లీకి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు
BRS MLAS Auto

ఆటో డ్రైవర్ల సమస్యలపై దృష్టి సారిస్తూ, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఖాకీ చొక్కాలు ధరించి నిరసన తెలిపారు. ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ, Read more

ఉప ఎన్నికలకు సిద్ధమైన కడియం శ్రీహరి
ఉప ఎన్నికలకు సిద్ధమైన కడియం శ్రీహరి

తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఉపఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. గతేడాది బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలలో ఆయన Read more

×