Over 500 Indians released from UAE prisons

UAE: క్షమాభిక్ష..యూఏఈ జైళ్ల నుంచి 500 మందికి పైగా భారతీయులు విడుదల!

UAE: భారత్‌తో సత్సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే క్రమంలో యూఏఈ అనూహ్య నిర్ణయం తీసుకుంది. పవిత్ర రంజాన్‌ మాసం సందర్భంగా భారీ సంఖ్యలో ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించింది. అందులో భారత్‌కు చెందిన వాళ్లే 500 మందికి పైగా ఉండగా.. వాళ్లంతా జైళ్ల నుంచి విడుదలైనట్లు సమాచారం. ఈ చర్య భారత్‌- యూఏఈల మధ్య బలమైన సంబంధాలను తెలియజేస్తోంది.

యూఏఈ  జైళ్ల నుంచి 500 మందికి

దుబాయ్‌లోని జైళ్లలో మగ్గుతున్న వివిధ దేశాలకు చెందిన ఖైదీ

రంజాన్‌ సందర్భంగా యూఏఈ అధ్యక్షుడు షేక్‌ మహ్మద్‌ బిన్‌ జాయేద్‌ అల్‌ నహ్యాన్‌ అక్కడి జైళ్లలో ఉన్న 1,295 మంది ఖైదీలను విడుదల చేయాలని ఆదేశించారు. మరోవైపు ప్రధాని షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌ కూడా 1,518 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దుబాయ్‌లోని జైళ్లలో మగ్గుతున్న వివిధ దేశాలకు చెందిన ఖైదీలకు తాజా క్షమాభిక్ష వర్తిస్తుందని అటార్నీ జనరల్‌, ఛాన్సలర్‌ ఎస్సమ్‌ ఇస్సా అల్‌ హుమైదాన్‌ ప్రకటించారు.

ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించడం యూఏఈలో ఆనవాయితీ

రంజాన్‌ మాసం సందర్భంగా ఇలా ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించడం.. విడుదల చేయడం యూఏఈలో ఆనవాయితీగా వస్తోంది. అయితే సత్ప్రవర్తనను ఆధారంగా చేసుకునే ఆయా ఖైదీలను ఎంపిక చేసి విడుదల చేస్తుంటారు. అంతేకాదు వాళ్లు జనజీవన స్రవంతిలో కలిసిపోయేందుకు అవసరమయ్యే ఆర్థిక సాయం కూడా అందించనున్నారు. కాగా, యూఏఈలో మరణశిక్షలు పడిన భారతీయులు 25 మంది ఉన్నారని, వారిపై కోర్టు తీర్పులు ఇంకా అమలుకాలేదని విదేశీ వ్యవహారాలశాఖ సహాయమంత్రి కీర్తి వర్థన్‌సింగ్‌ ఇటీవల రాజ్యసభలో తెలిపారు.

Related Posts
Youtuber Harsha Sai: బెట్టింగ్ యాప్స్ పై : హర్షసాయిపై కేసు నమోదు
Youtuber Harsha Sai బెట్టింగ్ యాప్స్ పై హర్షసాయిపై కేసు నమోదు

Youtuber Harsha Sai: బెట్టింగ్ యాప్స్ పై : హర్షసాయిపై కేసు నమోదు తెలంగాణలో బెట్టింగ్ యాప్స్పై కఠినంగా వ్యవహరిస్తున్న ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, వాటికి Read more

శంషాబాద్ ఎయిర్పోర్టుకు అవార్డు
shamshabad airport

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (శంషాబాద్ ఎయిర్‌పోర్టు) మరోసారి ప్రపంచవ్యాప్తంగా తన ప్రతిభను చాటుకుంది. ఎయిర్‌పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ACI) నిర్వహించిన సర్వీస్ క్వాలిటీ సర్వేలో, Read more

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతకు భారీ ప్రైజ్ మనీ?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రైజ్ మనీ వివరాలు

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో అత్యంత ఆసక్తికరమైన ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు మరియు న్యూజిలాండ్ జట్టు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ యొక్క తుది Read more

సీఎం చంద్రబాబుని కలిసిన ముస్లిం సంఘాలు
Muslim groups met CM Chandr

అంతర్జాతీయ ముస్లిం లా బోర్డు మరియు పలు ముస్లిం సంఘాలు కేంద్రం ప్రతిపాదించిన వర్ఫ్ చట్టానికి సంబంధించి సవరణలను వ్యతిరేకించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుని కోరాయి. ఈ సందర్భంగా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *