భారత్-పాక్ మధ్య ఉద్రిక్తత ఉధృతం: పాక్ మిస్సైల్ దాడికి సమర్థవంతమైన భారత ప్రతిస్పందన
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ సమీపంలోని బైసరన్ లోయలో ఇటీవల జరిగిన ఉగ్రదాడితో భారత్,పాక్ నడుమ ఉద్రిక్తత మరింత తీవ్రతరంగా మారింది. ఈ దాడిలో అమాయక పౌరుల ప్రాణాలు పోవడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహం వెల్లువెత్తింది. ఈ దాడికి ప్రతీకారంగా భారతదేశం ప్రారంభించిన ‘ఆపరేషన్ సింధూర్’ తీవ్ర స్థాయిలో కొనసాగుతూనే ఉంది. ఈ ఆపరేషన్ నేపథ్యంలో భారత-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. పాక్ సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతూ భారత నియంత్రణ రేఖ వద్ద కాల్పుల ఒప్పందాన్ని నిర్లక్ష్యం చేస్తోంది.

జమ్మూ నగరంలోని ఆలయాన్ని లక్ష్యంగా చేసుకున్న పాక్ మిస్సైల్ దాడి
ఇటీవలే జమ్మూ నగరంలోని రూప్నగర్ ప్రాంతంలోని సత్రియన్లో ఉన్న ప్రముఖ ఆప్ శంభు ఆలయం పై పాక్ మిస్సైల్ దాడికి తెగబడింది. ఈ దాడిని భారత భద్రతా బలగాలు ముందుగానే గుర్తించి, అత్యాధునిక ఆకాశ్ మిస్సైల్ టెక్నాలజీ సాయంతో గాల్లోనే అడ్డగించి నాశనం చేశాయి. ఇది పాక్ కుట్రలు ఎప్పటికీ భారత్ భద్రతను దెబ్బతీయలేవని మరోసారి రుజువు చేసింది. నివాస ప్రాంతాలు, ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలు, ఆలయాలను లక్ష్యంగా చేసుకుని పాక్ కాల్పులకు తెగబడుతోంది. ఈ క్రమంలోనే జమ్మూ నగరంలోని రూప్నగర్ ప్రాంతంలోని సత్రియన్లో ఉన్న ప్రముఖ ఆప్ శంభు ఆలయాన్ని పాక్ ఆర్మీ టార్గెట్గా చేసుకుని మిస్సెల్ దాడికి పాల్పడింది.
సరిహద్దుల్లో పాక్ రెచ్చిపోయిన చర్యలు – భారత స్పందన దడ పుట్టిస్తోంది
పాక్ సైన్యం కుప్వారా, బారాముల్లా, ఉరి, అఖ్నూర్ వంటి సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులకు తెగబడుతూ తన అసహనం వ్యక్తపరుస్తోంది. ఆపరేషన్ సింధూర్ కింద భారత బలగాలు పాక్ కుట్రలను ధ్వంసం చేస్తూ ముందుకు సాగుతున్నాయి. ఇందులో భారత గూఢచార సంస్థలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. పాక్ దాడులపై భారత కౌంటర్ అటాక్ చర్యలు ప్రపంచ దేశాలకు ఒక బలమైన సందేశం పంపిస్తున్నాయి. భారత్ శాంతిని కోరుకుంటూ, కానీ అవసరమైతే తగినంతగా కౌంటర్ చేయగలదనే విషయాన్ని మరోసారి నిరూపించింది.
ఉగ్రవాద దాడులకు ప్రతీకారం – ఆపరేషన్ సింధూర్ దీక్షతో ముందుకు సాగుతోన్న భారత సైన్యం
పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో అమాయకులు బలయ్యారు. ఈ దాడికి ప్రత్యుత్తరంగా భారత్ ప్రారంభించిన ఆపరేషన్ సింధూర్ పాక్ను గట్టిగా కుదిపేస్తోంది. పాక్ ప్రేరిత ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుంటూ భారత సైన్యం క్రమంగా దానిని నిర్మూలిస్తోంది. జాతీయ భద్రత విషయంలో భారత్లో ఎవ్వరైనా తేలికగా తీసుకోవాలంటే అది వారికి ఒక ఘోరమైన పొరపాటే అవుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, శత్రు దేశాలకు తగిన బుద్ధి చెప్తూ జాతీయ సాయుధ బలగాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన విషయం గమనార్హం.
Read also: India Pakistan War: రెండు పాక్ జెట్స్ను గాల్లోనే పేల్చేసిన భారత్